T20 WC 2026: టీమిండియా ఓటమికి ఆ తప్పిదాలే కారణం: అశ్విన్

Read Time:  1 min
T20 WC 2026: టీమిండియా ఓటమికి ఆ తప్పిదాలే కారణం: అశ్విన్
FONT SIZE
GET APP

T20 WC 2026: సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ప్రోటీస్ బౌలర్ల ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 76 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఎవరూ క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో ఈ ఘోర పరాజయం తప్పలేదు.

Read also: IND vs SA: టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్నాం: దక్షిణాఫ్రికా కెప్టెన్

T20 WC 2026: Those mistakes are the reason for Team India's defeat: Ashwin
T20 WC 2026: Those mistakes are the reason for Team India’s defeat: Ashwin

రింకూ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్‌పై అసహనం

ఈ ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందించారు. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‎ను ఆడించడం పెద్ద తప్పిదమని, అలాగే పవర్ హిట్టర్ రింకు సింగ్‎ను 8వ స్థానంలో బ్యాటింగ్‎కు పంపడం కూడా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫామ్‎లో ఉన్న అక్షర్ పటేల్‎ను పక్కనపెట్టి సుందర్‎ను ఆడించడమే ఓటమికి ఒక కారణమని అభిమానులు కూడా వాదిస్తున్నారు. సౌతాఫ్రికా 187/7 స్కోరు చేయగా, ఇండియా 111 పరుగులకే కుప్పకూలింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.