T20 WC 2026: టీ20 ప్రపంచకప్లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్లో అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆఫ్ఘన్.. ఈ గెలుపుతో పాయింట్ల ఖాతా తెరిచింది. యూఏఈ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (53) అర్ధశతకంతో రాణించగా, దర్విష్ రసూలీ (33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Read Also: IndVsPak: అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్తో పాకిస్థాన్పై భారీ అంచనాలు
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఒమర్జాయ్
చివర్లో, అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 బంతుల్లో 40 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించాడు.అంతకుముందు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్… యూఏఈని కట్టడి చేసింది. యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సోహైబ్ ఖాన్ (68) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి యూఏఈ పతనాన్ని శాసించాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్కు రెండు వికెట్లు దక్కాయి. ఒమర్జాయ్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: