Suryakumar Yadav statement : టీ20 ప్రపంచకప్ ఫైనల్కు ముందు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్పై వస్తున్న విమర్శలను భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఖండించాడు. అతడిపై పూర్తి నమ్మకం ఉందని, ఫైనల్లో తప్పక రాణిస్తాడని సూర్య ధీమా వ్యక్తం చేశాడు.
సెమీఫైనల్ ప్రదర్శనపై చర్చ
ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అంతకుముందు వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో కూడా అతడు 40 పరుగులు ఇచ్చాడు. దీంతో అతడి ఫామ్పై విమర్శలు వచ్చాయి.
‘అతడు వరల్డ్ క్లాస్ బౌలర్’
ఈ విమర్శలపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్, “ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది టీమ్ గేమ్. ప్రతి ఆటగాడికి ప్రతిరోజూ ఒకేలా ప్రదర్శన ఉండదు. వరుణ్ ప్రపంచ నంబర్ 1 బౌలర్. మ్యాచ్లు ఎలా గెలవాలో అతడికి బాగా తెలుసు” అని అన్నారు.
Read Also: Kamal Haasan-Trump: ట్రంప్కు కమల్ హాసన్ కౌంటర్
ఆఫ్ స్పిన్ బలహీనతపై స్పందన
భారత బ్యాటర్లు ఆఫ్ స్పిన్కు ఇబ్బంది పడుతున్నారన్న వ్యాఖ్యలపై కూడా సూర్య స్పందించాడు. గత మ్యాచ్లో ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ వంటి లెఫ్ట్ హ్యాండర్లు ఆఫ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నాడు.
స్వదేశంలో ఫైనల్ ప్రత్యేక అనుభూతి
స్వదేశంలో ప్రపంచకప్ ఫైనల్కు కెప్టెన్గా వ్యవహరించడం ప్రత్యేక అనుభూతి అని సూర్య అన్నారు. “ఒత్తిడి తప్పదు. కానీ అదే మ్యాచ్కు అసలు మజా తీసుకొస్తుంది. దేశం మొత్తం ఈ ఫైనల్ కోసం ఎదురుచూస్తోంది” అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: