శ్రీలంక, బంగ్లాదేశ్ (Sri Lanka, Bangladesh) మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఓ అసాధారణ సంఘటన క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో మైదానంలోకి భారీ పాము (A huge snake entered the field) ప్రవేశించి కలకలం రేపింది. ఈ దృశ్యాన్ని చూసిన ఆటగాళ్లు, అభిమానులు క్షణాల్లో షాక్ అయ్యారు.బంగ్లాదేశ్ ఛేదన సమయంలో, మూడో ఓవర్లో లంక బౌలర్ అసిత్ ఫెర్నాండో బౌలింగ్ చేయబోతుండగా, పాయింట్ బౌండరీ దగ్గర ఓ ఏడడుగుల పాము కనిపించింది. ఆటగాళ్లు వెంటనే అప్రమత్తమై అంపైర్లకు తెలిపారు. ఆ వెంటనే మ్యాచ్ నిలిపివేశారు.
గ్రౌండ్ సిబ్బంది అప్రమత్తం – పామును తొలగింపు
సిబ్బంది చాకచక్యంగా స్పందించి పామును సురక్షితంగా పట్టుకుని బయటకు తీసారు. ఎవరికీ హాని జరగకపోవడంతో స్టేడియంలో ఊపిరి పీల్చుకున్నట్టైంది. కొన్ని నిమిషాల విరామం తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది.ఈ సంఘటనతో 2018 నిదహాస్ ట్రోఫీ పూట బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన ‘నాగిని డ్యాన్స్’ మళ్లీ సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. అప్పటి వైరం మళ్లీ చర్చలోకి వచ్చింది. నిజంగానే పాము మైదానంలోకి రావడంతో జోకులు, మీమ్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.
శ్రీలంక విజయం – హసరంగ గర్జన
మ్యాచ్ విషయానికి వస్తే, శ్రీలంక పూర్తిగా పైచేయి సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన లంక జట్టు, చరిత్ అసలంక అద్భుత శతకంతో 293 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 216 పరుగులకే కుప్పకూలింది.బంగ్లాదేశ్ బ్యాటింగ్ను చీల్చి వేసిన వనిందు హసరంగ, కేవలం 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఫలితంగా శ్రీలంక 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Read Also : Shubman Gill : తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 587 ఆలౌట్