ఆసియా కప్లో భారత్–పాక్ (India-Pak) మ్యాచ్పై రైనాకు సంచలన వ్యాఖ్యలు ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్–పాక్ మ్యాచ్ విశేషంగా చర్చనీయాంశమైంది. కేవలం మైదానంలో ఆటగాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు మాత్రమే కాకుండా, వారి మానసిక స్థితి కూడా ఈ మ్యాచ్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఊపునిచ్చాయి. రైనా (Raina) ప్రకారం, భారత ఆటగాళ్లెవరూ పాక్తో ఈ మ్యాచ్ ఆడాలని కోరుకోలేదట. “నా వ్యక్తిగత అవగాహన ప్రకారం, టీమ్లో ప్రతి ఒక్కరూ ఆసియా కప్లో పాకిస్థాన్తో తలపడటానికి వెనకాడేవారు. కానీ బీసీసీఐ నిర్ణయం వల్లే వాళ్లు బరిలోకి దిగారు. ఆటగాళ్లను వ్యక్తిగతంగా అడిగితే, వారి సమాధానం ఖచ్చితంగా ‘ఆడము’ అని ఉండేది,” అని రైనా స్పష్టంచేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా రంగంలో చర్చనీయాంశంగా మారాయి.
పహల్గామ్ దాడి ప్రభావం
ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, అనంతరం జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ కారణంగా భారత్–పాక్ సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సంవత్సరం ఆసియా కప్ జరుగుతుందా అన్న సందేహాలే ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో కూడా భారత్ పాక్ మ్యాచ్ను బహిష్కరించాలంటూ గళమెత్తిన వారు చాలామంది. అయితే బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు టోర్నమెంట్ను కొనసాగించాలని నిర్ణయించడంతో మ్యాచ్ జరిగింది.

Sports
మైదానంలో ప్రతిస్పందన
మైదానంలో మాత్రం టీమిండియా (Team India) ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరిచి పాకిస్థాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేశారు. ఈ విజయం పహల్గామ్ దాడి బాధితులకు అంకితమైందని క్రీడాభిమానులు భావించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో హస్తదానానికి నిరాకరించారు. ఇది తాత్కాలిక భావోద్వేగ నిర్ణయం కాదని, ముందుగానే తీసుకున్న నిర్ణయం అని సమాచారం. సురేశ్ రైనా (Suresh Raina) వ్యాఖ్యలు కేవలం ఆటగాళ్ల మనోభావాలకే కాకుండా, క్రీడా రాజకీయాలపై కూడా స్పష్టమైన సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఆటగాళ్లు దేశ ప్రయోజనాలు, ప్రజా భావోద్వేగాలు దృష్టిలో ఉంచుకుని ఆడినా, వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయనే విషయం రైన మాటల ద్వారా బహిర్గతమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: