భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) జీవితంలో త్వరలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. దేశవ్యాప్తంగా అభిమానులను తన బ్యాటింగ్తో మంత్రముగ్ధుల్ని చేసిన ఈ క్రికెటర్ త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు. ఆమె తన ప్రియుడు, బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ (Palash Muchhal) ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.
Read Also: India vs Australia: మహిళల ప్రపంచ కప్..టాస్ ఓడిన భారత్
టైమ్స్ ఎంటర్టైన్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, వీరి పెళ్లి వేడుకలు స్మృతి మంధాన స్వస్థలం మహారాష్ట్రలోని సాంగ్లీ (Sangli) లో ఘనంగా జరగనున్నాయి. నవంబర్ 20న ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనే విధంగా ఈ వివాహ వేడుక జరగనుంది.
2019లో డేటింగ్ ప్రారంభించిన స్మృతి, పలాష్, జులై 2024లో వీరి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భావోద్వేగ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను పంచుకోవడం ద్వారా వారి సంబంధాన్ని బహిరంగపరిచారు.స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సుమారు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
సోషల్ మీడియాలో వీరిద్దరూ తరచుగా కలిసి దిగిన ఫొటోలు పంచుకుంటూ అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఇటీవల పలాష్ ముచ్ఛల్ స్వయంగా వీరి పెళ్లిని ధృవీకరించారు. ఇండోర్ నుంచి వచ్చిన పలాష్ ముచ్ఛల్… “స్మృతి (Smriti Mandhana) త్వరలో ఇండోర్కు కోడలు కాబోతోంది” అంటూ నవ్వుతూ ప్రకటించారు.
ఈ ప్రకటనతో అభిమానులు, క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.క్రికెట్లో తన కవర్ డ్రైవ్లు, మెరుపు బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్మృతి మంధాన.. ఇకపై సంగీత ప్రపంచంతో బంధుత్వం కలుపుకోబోతున్నారు. పలాష్ ముచ్ఛల్ బాలీవుడ్లో మంచి పేరున్న సంగీత దర్శకుడు. ఆయన సోదరి పాలక్ ముచ్ఛల్ (Palak Muchhal) కూడా ప్రముఖ గాయని అన్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: