Shukri Conrad: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026లో అప్రతిహత విజయాలతో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. లీగ్ దశ నుంచి సూపర్-8 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి తన సత్తా చాటింది. మార్చి 4న కోల్కతాలో న్యూజిలాండ్తో తలపడనుంది. గతంలో ‘చోకర్స్’గా పేరున్న తమపై ఉన్న ముద్రను చెరిపివేశామని హెడ్ కోచ్ శుక్రి కొన్రాడ్ తెలిపారు.ఈ టోర్నీలో భాగంగా జింబాబ్వేతో చివరి సూపర్-8 మ్యాచ్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన కాన్రాడ్ “ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో ముఖ్యం. సీ (చోకర్స్) అనే మాటకు మరో అర్థం ఉంది – కప్కేక్స్. ఆ ప్రకటనను మేము ఆస్వాదించాం” అని సరదాగా వ్యాఖ్యానించారు.
Read Also: Rohit Sharma: ఆ మ్యాచ్ను మించింది మరొకటి లేదు
అహ్మదాబాద్ ఫైనల్పై గురి
గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచి చోకర్స్ ముద్రను తుడిచేసుకున్న దక్షిణాఫ్రికా, ఈసారి కూడా అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడబోతున్న నేపథ్యంలో, ఒత్తిడి గురించి ప్రశ్నించగా “సెమీఫైనల్ అంటేనే ఒత్తిడి. ప్రత్యర్థి న్యూజిలాండ్ అయితే మరింత. కానీ మేం మా ఆటతీరును మార్చం. అదే విధంగా సిద్ధమవుతాం” అని కాన్రాడ్ స్పష్టం చేశారు.
టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న కారణంగా ఫేవరెట్గా మారిన విషయంపై కూడా స్పందిస్తూ “ఫేవరెట్గా ఆడటం కూడా ఒక మంచి అనుభవమే. అండర్డాగ్గా ఉండటం కంటే ఇది బెటర్” అన్నారు. ఫైనల్ వేదికగా భావిస్తున్న అహ్మదాబాద్పై కూడా చమత్కారంగా స్పందించిన కాన్రాడ్ “ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్లు ఆడాం. ఇది మా హోం గ్రౌండ్లా మారిపోయింది” అంటూ నవ్వులు పూయించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: