లక్నో వేదికగా సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ జట్టు మెరుపు ఆరంభం ఇచ్చినా, చివర్లో స్థిరంగా ఆడలేక ఆశించిన స్కోర్ చేయలేకపోయింది.మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారి వాజ్పేయి స్టేడియంలో జరిగింది.టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో, గుజరాత్ టైటన్స్ మొదట బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అదరగొట్టారు.
వీరిద్దరూ తొలి వికెట్కి 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.గిల్ 38 బంతుల్లో 60 పరుగులు చేయగా, అందులో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.సాయి సుదర్శన్ కూడా నిదానంగా ఆడుతూ 37 బంతుల్లో 56 పరుగులు చేశారు.అతడి ఇన్నింగ్స్లో 7 బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి.కానీ వీరిద్దరూ రెండు పరుగుల తేడాతో వెనుదిరిగిన తర్వాత గుజరాత్ స్కోరు నిదానంగా మారింది.ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ 14 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.వాషింగ్టన్ సుందర్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.షెర్ఫానే రూథర్ ఫోర్డ్ 22 పరుగులు, షారుఖ్ ఖాన్ 11 పరుగులు చేశారని చెప్పొచ్చు.రాహుల్ తెవాటియా మాత్రం డకౌట్ అవుతూ అభిమానులను నిరాశపరిచాడు.ప్రారంభంలో తడబడిన లక్నో బౌలర్లు, గిల్ – సుదర్శన్ ఔట్ అయిన తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. గుజరాత్ను 200 స్కోరు దాటకుండా నిలిపేశారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీసారు. దిగ్వేజ్ రాఠీ, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు.గుజరాత్ టైటన్స్ ఆరంభం అద్భుతంగా ఉన్నా, మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఆడింది. ఇది వారిని భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంది. ఇప్పుడిదే చర్చ – గుజరాత్ జట్టు మరో 20 పరుగులు చేసింది అయితే గేమ్ ఫలితం వేరేలా ఉండేదా?
Read Also : IPL 2025: ధోని జట్టు వ్యూహాలపై స్పందించిన మనోజ్ తివారీ