టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubhman Gill) 13 ఏళ్ల తర్వాత ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి బ్యాటింగ్కు దిగిన తొలి కెప్టెన్గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. వెస్టిండీస్తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో గిల్ ఈ చెత్త ఫీట్ను నమోదు చేశాడు (Shubhman Gill) .ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.
Read Also: John Campbell: విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ తొలి సెంచరీ
అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియాకు 270 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. వెంటనే వెస్టిండీస్ను ఫాలో ఆన్ ఆడించిన టీమిండియా (Team India) కు ఆ జట్టు నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.తొలి ఇన్నింగ్స్లో 81.5 ఓవర్లు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు తీవ్రంగా అలసిపోయారు.
రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాటర్లు (West Indies batters) ఔట్ చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా మారడంతో భారత బౌలర్ల కష్టాలు రెట్టింపు అయ్యాయి. జాన్ కాంప్బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 103) సెంచరీలతో రాణించారు.
ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి
ఈ ఇద్దరూ మూడో వికెట్కు 177 పరుగులు జోడించారు. కాంప్బెల్ (Campbell) కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కాగా.. 8 ఏళ్ల తర్వాత షైహోప్ మరో శతకాన్ని అందుకున్నాడు.ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్తో వెస్టిండీస్ ఈ మ్యాచ్లో టీమిండియా ఆధిక్యాన్ని అధిగమించి.. మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది.
93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఇది ఐదోసారి మాత్రమే. ఇప్పటి వరకు మొత్తం 41 సార్లు ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించిన టీమిండియా.. నాలుగు సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగింది.
గిల్ నాయకత్వం కింద టీమిండియా బలంగా ఉన్నా, వ్యూహాత్మక నిర్ణయాలు మ్యాచ్ ఫలితంపై ఎంత ప్రభావం చూపుతాయో ఈ టెస్ట్ మరోసారి నిరూపించింది. వెస్టిండీస్ పోరాటం భారత్ బౌలర్లకు పరీక్షగా మారింది, గిల్ కెప్టెన్సీకి ఒక సవాలుగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: