ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో గాయపడ్డ టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ప్రస్తుతం కోలుకుంటున్నారు. మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా అనుకోకుండా గాయపడ్డ ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సిడ్నీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో శ్రేయస్ (Shreyas Iyer)కు వైద్యులు మైనర్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉండటంతో ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారిక ప్రకటనలో తెలిపింది.
Read Also: Gautam Gambhir: టీమిండియా పేలవ ప్రదర్శన.. గంభీర్పై విమర్శలు
BCCI ప్రకారం, శ్రేయస్ పూర్తిగా కోలుకునే వరకు కొన్ని రోజులు సిడ్నీలోనే ఉండనున్నారని పేర్కొంది. సిడ్నీ వైద్యులు, భారత మెడికల్ టీమ్ అందించిన సహకారం పట్ల BCCI ధన్యవాదాలు తెలిపింది.శ్రేయస్ గాయంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, BCCI ఇచ్చిన ఈ అప్డేట్తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: