భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ (Women World Cup 2025) ట్రోఫీను హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సేన ఎట్టకేలకు ముద్దాడింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ పోరులో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.
Read also: Shubman Gill: గిల్ స్థానం పై విమర్శల తుఫాన్
అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించిన హర్మన్ సేన
స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి క్రీడాకారుణుల సమష్టి కృషితో ఈ అద్భుత విజయం సాధ్యమైంది. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటగా, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సైతం జట్టు సభ్యులను స్వయంగా కలిసి అభినందించారు.ఈ ఆనందకర వాతావరణంలో, భారత మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి (Shantha Rangaswamy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
హర్మన్ప్రీత్ కౌర్ ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకుని, తన బ్యాటింగ్, ఫీల్డింగ్పై మరింత దృష్టి సారించాలని ఆమె సూచించారు. జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ మార్పు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై క్రీడా వర్గాలు, అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.

అంజుమ్ చోప్రా తీవ్ర అసంతృప్తి
అయితే, శాంత రంగస్వామి (Shantha Rangaswamy) వ్యాఖ్యలపై మరో మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆమె ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. “ప్రతి ప్రపంచకప్ తర్వాత ఇలాంటి ఒక ప్రకటన రావడం మామూలే.
గత నాలుగు, ఐదు వరల్డ్ కప్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. భారత్ ఓడితే హర్మన్ను కెప్టెన్సీ నుంచి తీసేయమంటారు, ఇప్పుడు గెలిచినా కూడా అదే మాట అంటున్నారు” అని అంజుమ్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: