అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత ఓపెనర్ సంజూ శామ్సన్ పరుగుల విధ్వంసం సృష్టించడమే కాకుండా, క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా సంజూ శామ్సన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2014 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ సాధించిన 319 పరుగుల రికార్డును శామ్సన్ ఈ ఫైనల్ ఇన్నింగ్స్తో అధిగమించాడు. ప్రస్తుత టోర్నీలో సంజూ మొత్తం 321 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచారు. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూనే, మరోవైపు దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను తిరగరాయడం సంజూ ఫామ్కు నిదర్శనంగా నిలుస్తోంది. ఒత్తిడిలోనూ అద్భుతమైన షాట్లతో అలరించిన శామ్సన్, భారత బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించారు.
Read Also : YS Sharmila statement : నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్
కేవలం పరుగుల పరంగానే కాకుండా, సిక్సర్ల బాదుడులోనూ సంజూ శామ్సన్ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజూ నిలిచాడు. ఫైనల్ మ్యాచ్కు ముందు కివీస్ ఆటగాడు ఫిన్ అలెన్ 20 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, నేటి మ్యాచ్లో సంజూ ఏకంగా 8 భారీ సిక్సర్లు బాది మొత్తం 24 సిక్సర్లతో ప్రథమ స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో హెట్మెయర్ (19 సిక్సర్లు) మూడో స్థానంలో ఉన్నారు. గాల్లోకి బంతులను తరలిస్తూ ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిన సంజూ, ఈ మెగా టోర్నీలో ‘సిక్సర్ల కింగ్’గా అవతరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com