ICC CEOగా సంజోగ్ గుప్తా

Read Time:  1 min
ICC CEOగా సంజోగ్ గుప్తా
FONT SIZE
GET APP

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కొత్త ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా భారతీయుడు సంజోగ్ గుప్తా (Sanjog Gupta) నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఆయన అధికారికంగా CEO పదవిలో బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. సంజోగ్ గుప్తా జియోస్టార్ సంస్థలో స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్‌పీరియన్స్ CEOగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పరిపాలన బాధ్యతను చేపట్టడం విశేషంగా మారింది.

జర్నలిస్టుగా ప్రారంభం – టీవీ రంగంలో ఎదుగుదల

సంజోగ్ గుప్తా (Sanjog Gupta) కెరీర్ జర్నలిజం ద్వారా ప్రారంభమైంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో బీఏ డిగ్రీ పొందిన ఆయన, మీడియా రంగంలో అడుగుపెట్టి అక్కడ తన ప్రతిభను చాటుకున్నారు. అనేక ప్రసిద్ధ టీవీ నెట్‌వర్క్‌లతో పనిచేసిన ఆయన, క్రీడా కార్యక్రమాల్లో నూతన ఆవిష్కరణల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. టెలివిజన్ రంగంలో సాంకేతికత, కంటెంట్ పరంగా సంజోగ్ అందించిన మార్పులు మరువలేనివి.

ఐసీసీ చరిత్రలో ఏడో CEOగా సంజోగ్

సంజోగ్ గుప్తా, ICC CEOగా బాధ్యతలు స్వీకరించిన ఏడో వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. గతంలో డేవిడ్ రిచర్డ్సన్, మణోహర్, గెఫ్ ఆలార్డైస్ లాంటి ప్రముఖులు ఈ పదవిని నిర్వహించారు. భారతీయుడిగా ఈ పదవిని చేపట్టడం గర్వకారణమని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి, నూతన మార్కెట్లను అన్వేషించడానికి సంజోగ్ నాయకత్వం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ICCలో ఆయనకు ఎదురయ్యే సవాళ్లలో భారత్, ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో సమన్వయం, కొత్త టోర్నీల ఆవిష్కరణ ప్రధానంగా ఉంటాయి.

Read Also : IND vs ENG: ఓటమిపై బెన్ స్టోక్స్ ఏమన్నారంటే?

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.