ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు హాట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్థాన్ ట్రోఫీ గెలుచుకుంది. కానీ, ప్రస్తుత టోర్నమెంట్లో భారత్ ఎక్కువ బలమైన జట్టుగా కనిపిస్తోందని అనేక విశ్లేషకులు భావిస్తున్నారు.ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరుగుతున్నప్పటికీ, బీసీసీఐ ఒత్తిడి కారణంగా టీమిండియా తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడుతోంది. ఆసక్తికరంగా, భారత్, పాకిస్థాన్ ఫైనల్స్కు చేరినప్పటికీ (ఫైనల్ మ్యాచ్) కూడా దుబాయ్లోనే జరగనుంది. రేపు (ఆదివారం) దాయాదుల పోరు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా, క్రికెట్ అభిమానులు దీనిని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ మ్యాచ్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ జట్టు గతంలో ప్రపంచ స్థాయి స్పిన్ బౌలర్లను కలిగి ఉండేదని, కానీ ప్రస్తుతం ఒక్క స్పిన్నర్ కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. భారత్తో పోలిస్తే పాక్ జట్టు బలహీనంగా ఉందని, రేపటి మ్యాచ్లో మెరవడానికి పెద్దగా అవకాశాలు లేవని చెప్పారు.అంతేగాక, క్రికెట్ అభిమానులను అడిగితే భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరును అత్యుత్తమని చెబుతారని. అయితే, నాణ్యత పరంగా చూస్తే ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లు ఇంకా ఉత్తమంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, రేపటి మ్యాచ్కు క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని, ఆదివారం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కచ్చితంగా క్రికెట్ ఫీవర్ను తీసుకొస్తుందని అన్నారు.
రేపు జరగబోయే ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ పై ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తొమ్మిదో ఓవర్లోనే 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. అయితే భారత జట్టు అనుకున్నంత సులువుగా గెలవలేదు. మొదట్లో తడబడినప్పటికీ, తౌహిద్ హృదయ్, జాకెర్ అలీ అద్భుత భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ పోరాటంలోకి వచ్చింది. హృదయ్ సెంచరీ చేశాడు. జాకెర్ హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా క్యాచ్లు వదిలేయడం, కేఎల్ రాహుల్ స్టంపింగ్ చేసే అవకాశం కోల్పోవడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు సద్వినియోగం చేసుకున్నారు. 49.4 ఓవర్లలో 228 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు పెద్దగా ఇబ్బంది ఉండకూడదు. అయితే గెలవడానికి అవసరమైన పరుగులు చేసే క్రమంలో భారత జట్టు కొన్ని వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది.
ఏది ఏమైనా, రేపటి భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని ఉత్కంఠను అందించబోతోంది. చూడాలి మరి, ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ట్రోఫీని ఏ జట్టు ఎత్తుకుపోతుందో!