Sachin Tendulkar: టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జింబాబ్వేను చిత్తు చేస్తూ 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోరు సాధించి, ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.
Read Also: Arshdeep wickets record : అర్ష్దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు
ఒత్తిడిని అధిగమించి.. రికార్డులు తిరగరాసి!
గత మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలవడంతో భారత్ నెట్ రన్ రేట్ బాగా పడిపోయింది. దీంతో సెమీస్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై భారీ విజయం అత్యవసరమైంది. ఈ ఒత్తిడిలోనూ భారత ఆటగాళ్లు ఎక్కడా తడబడలేదు. వ్యక్తిగత సెంచరీలు లేకపోయినా, ప్రతి బ్యాటర్ మెరుపు వేగంతో ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టుదిట్టంగా నిలవరించి, జట్టుకు కీలక విజయాన్ని అందించారు.
జట్టు పట్టుదలకు సచిన్ ఫిదా: ‘ఎక్స్’ వేదికగా ప్రశంసలు
భారత జట్టు ప్రదర్శనపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. “తప్పక గెలవాల్సిన మ్యాచ్లు ఆటగాళ్ల అసలు స్వభావాన్ని బయటపెడతాయి. 256 పరుగుల భారీ స్కోరు సాధించడం అద్భుతం. ఈ ప్రపంచకప్లో ఇదే అత్యధిక స్కోరు. జట్టు చూపిన పట్టుదల నిజంగా అభినందనీయం. ఇదే జోరును తర్వాతి మ్యాచ్లోనూ కొనసాగించండి. అలాగే ఈ టోర్నీలో మంచి పోరాటపటిమ చూపుతున్న జింబాబ్వేకు కూడా అభినందనలు” అని రాసుకొచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: