📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

రిటైర్మెంట్ పై సంచలన నిర్ణయం రోహిత్ శర్మ

Author Icon By Divya Vani M
Updated: February 5, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2021 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. అప్పట్లో టెస్టు మరియు వన్డే జట్లకు తన నాయకత్వం కొనసాగించగల సామర్థ్యముంది అని హిట్ మ్యాన్ ప్రకటించాడు. కానీ ఇటీవల రోహిత్ ఆటగాడిగా కెప్టెన్‌గా విఫలమవుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శనతో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును నడిపించే బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించారు.పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, రోహిత్ తన భవిష్యత్తు గురించి బీసీసీఐకు చెప్పాల్సిన సమయం దగ్గర పడింది. 2025 ఏప్రిల్‌లో రోహిత్ 38 ఏళ్లవుతారు, ఇది అతని కెరీర్ చివరి దశ అని చెప్పొచ్చు.ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ గురించి పుకార్లు వస్తూనే ఉన్నాయి.

టెండూల్కర్, ద్రవిడ్‌ల వంటివారికి మాదిరిగా రోహిత్ శర్మ గురించి కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి.ఒక నివేదిక ప్రకారం టీం ఇండియా సెలెక్టర్లు 2027 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు.రోహిత్ శర్మ తన వైఖరిని స్పష్టంగా చెప్పాల్సిన సమయం ఇదే. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టులో కొన్ని మార్పులు రావచ్చని భావిస్తున్నారు.రోహిత్ శర్మ కెరీర్‌ను ఈ టోర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తరువాత రోహిత్ తన భవిష్యత్తు నిర్ణయాలను బీసీసీఐకి తెలియజేయాలని కోరినట్లు సమాచారం.

బీసీసీఐ రోహిత్ శర్మ నుండి వచ్చే నిర్ణయాలను మరింత స్పష్టంగా ఆశిస్తోంది ఎందుకంటే రాబోయే WTC, 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంది.ఫిబ్రవరి 20 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన పోరాటాన్ని ప్రారంభిస్తుంది.ఈ టోర్నమెంట్ ముందు ఫిబ్రవరి 6 నుండి భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కూడా ప్రారంభం కానుంది.ఈ సిరీస్‌లో రోహిత్ శర్మనే నాయకుడిగా చూడబోతున్నాం ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేయడం ద్వారా రోహిత్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

2025 Champions Trophy BCCI Cricket News India Cricket Team KL Rahul Rishabh Pant Rohit sharma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.