క్రికెట్ ప్రపంచంలో రోహిత్ శర్మ (Rohit Sharma) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలోనే కాదు, బయట కూడా అభిమానులు అతన్ని చూసేందుకు ఎగబడుతుంటారు. అయితే, రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో వెళ్తున్న రోహిత్ వద్దకు ఇద్దరు చిన్నారులు వచ్చి సెల్ఫీ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో రోహిత్ (Rohit Sharma) కారు కిటికీలోంచి వారికి అభివాదం చేయడానికి చేయి బయట పెట్టగా, వారు ఆయన చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రోహిత్ వారిని హెచ్చరిస్తూ వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Read also: IPL 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా జడేజా?
అద్భుతంగా 2025 సంవత్సరం
టీమిండియా మాజీ సారథికి 2025 సంవత్సరం అద్భుతంగా సాగింది. భారీగా పరుగులు సాధించడమే కాకుండా పలు రికార్డులను ఆయన బద్దలు కొట్టారు. రోహిత్ సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే.ఇక తన కెరీర్లో తొలిసారిగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.
సిక్సర్ల రికార్డు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.నవంబర్లో దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన తొలి వన్డేలో రోహిత్ తన 352వ సిక్సర్ బాది, పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది (351 సిక్సర్లు) రికార్డును అధిగమించారు. 2015 నుంచి అఫ్రిది పేరిట ఉన్న ఈ రికార్డును ‘హిట్మ్యాన్’ తుడిచిపెట్టేశాడు. ప్రస్తుతం 279 వన్డేల్లో రోహిత్ ఖాతాలో 355 సిక్సర్లు ఉన్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: