Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. భారత్-పాకిస్థాన్ పోరులోని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ ఫైనల్, పాకిస్థాన్పై తనకు అత్యంత ఇష్టమైన మ్యాచ్ అని అభివర్ణించాడు. ఆ మ్యాచ్ను మించింది మరొకటి లేదని స్పష్టం చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్ ఎడిషన్కు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న రోహిత్, ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2007 నుంచి 2024 వరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్లలో పాకిస్థాన్తో (Pakistan) జరిగిన ప్రతీ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడటం విశేషం. ఆ టోర్నీలో మేం ప్రపంచకప్ గెలిచాం” అని రోహిత్ పేర్కొన్నాడు. అదే టోర్నీలో పాక్తో జరిగిన లీగ్ మ్యాచ్ కూడా బౌల్-అవుట్తో ముగిసిందని, అందులోనూ తామే గెలిచామని, ఆ రెండు మ్యాచ్లు తనకు చాలా ప్రత్యేకమని గుర్తుచేసుకున్నాడు.
Read Also: Suryakumar Yadav: సంజు శాంసన్పై కెప్టెన్ ప్రశంసలు
ప్రతీ మ్యాచ్కు తాను టెన్షన్ పడతానని వెల్లడి
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఒక దశలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో విరాట్ కోహ్లి ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ చారిత్రక విజయం సాధించింది. “ఆ మ్యాచ్లో కోహ్లి అద్భుతంగా ఆడాడు. మనం గెలవలేని స్థితి నుంచి జట్టును గెలిపించిన తీరు అమోఘం. క్రికెట్ చరిత్రలోనే అది ఒక గొప్ప మ్యాచ్. ప్రపంచకప్ లాంటి పెద్ద వేదికపై అలాంటి గెలుపు దక్కడం చాలా ప్రత్యేకం” అని రోహిత్ కొనియాడాడు.
ఇటీవలే టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, తాను ఆడిన 160 అంతర్జాతీయ మ్యాచ్లలో ప్రతీదానికి ఎంతో టెన్షన్ పడ్డానని అన్నాడు. “ఆటగాడిగా మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నాకు ఆ టెన్షన్ ఉంటుంది. ఆ భావనే నాలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే స్ఫూర్తిని నింపుతుంది” అని రోహిత్ అన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: