టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Kohli-Rohith) మళ్లీ దేశవాళీ క్రికెట్ రంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఒక దశ తర్వాత, మళ్లీ తమ రూట్స్ వైపు వెళ్లి ఫిట్నెస్, ఫామ్ కాపాడుకోవడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్ (New Zealand ODI series) కు ముందు, ఈ ఇద్దరూ విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో పాల్గొనబోతున్నారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇది టీమిండియా అభిమానులకు, ముఖ్యంగా దేశవాళీ క్రికెట్ అభిమానులకు పెద్ద వార్తగా మారింది.
IND vs South Africa: భారత్పై దక్షిణాఫ్రికా గెలుపు
సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్లు ఆడడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కువగా అంతర్జాతీయ షెడ్యూల్ బిజీగా ఉండటం, విశ్రాంతి అవసరం వంటి కారణాలతో ఈ అవకాశాలు తక్కువగా దొరుకుతాయి. అయితే, ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ఇటీవల బీసీసీఐ (BCCI) సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు – “సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ప్రతి ఆటగాడు ఫిట్గా ఉంటే, దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి” అని. ఈ నిబంధనను బట్టి రోహిత్, విరాట్ (Kohli-Rohith) కూడా పాల్గొనబోతున్నారు.

కనీసం మూడు మ్యాచ్లలోనైనా ఆడాలని
భారత జట్టు డిసెంబర్ 6న దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్తో తొలి వన్డే జనవరి 11న ప్రారంభమవుతుంది. ఈ రెండు సిరీస్ల మధ్య సుమారు ఐదు వారాల విరామం ఉంది. ఈ సమయంలోనే డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) ప్రారంభం కానుంది.
ముంబై జట్టు డిసెంబర్ 24 నుంచి జనవరి 8 మధ్య ఆరు మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కనీసం మూడు మ్యాచ్లలోనైనా ఆడాలని సెలెక్టర్లు ఆశిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇదే నిబంధన విరాట్ కోహ్లీకి కూడా వర్తిస్తుందని ఓ అధికారి పీటీఐకి వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: