టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit, Kohli) — భారత క్రికెట్కు రెండు ప్రధాన స్తంభాలుగా నిలిచిన ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్పై మరోసారి చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచ కప్ (2027 World Cup)లో వీరు పాల్గొంటారా లేదా అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Dinesh Karthik: రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ ప్రశంసలు
ఈ తరుణంలో వీరు 2027 ఆడాలనుకుంటే, మ్యాచ్ ప్రాక్టీస్ అనే అంశం ప్రధాన సవాలుగా మారుతుందని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డారు. ఈ సవాలును అధిగమించాలంటే, రోహిత్, కోహ్లీ దేశవాళీ క్రికెట్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని సూచించాడు.ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. “రోహిత్ తన ఫిట్నెస్పై చాలా శ్రద్ధ చూపించాడు.

కానీ రెగ్యులర్ క్రికెట్ ఆడకపోతే, ఆటలో ఉండే మ్యాచ్ టచ్ కోల్పోతారు. వారు టీ20లు ఆడటం లేదు, టెస్టులకు కూడా వీడ్కోలు పలికారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ప్రపంచ కప్కు ముందు భారత్ ఎక్కువ వన్డేలు ఆడదు.
రోహిత్, కోహ్లీ ఇప్పటి నుంచే తగిన సన్నాహాలు
టోర్నీకి ముందు సరైన ప్రాక్టీస్ లేకపోతే అది వారి ప్రదర్శనపై ప్రభావం చూపవచ్చు,” అని పఠాన్ అన్నారు.ఇర్ఫాన్ (Irfan Pathan) తన వ్యాఖ్యల్లో, “ఫిట్నెస్ ఒక్కటే సరిపోదు. నిరంతరంగా మ్యాచ్లు ఆడితేనే ఆటతీరును మెరుగుపర్చుకోవచ్చు. ఆ విషయంలో దేశవాళీ టోర్నీలు చాలా ఉపయోగపడతాయి.
2027 వరల్డ్ కప్లో ఆడాలన్న లక్ష్యంతో ఉన్న రోహిత్, కోహ్లీ ఇప్పటి నుంచే తగిన సన్నాహాలు మొదలు పెట్టాలి,” అని అభిప్రాయపడ్డాడు.ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) తర్వాత రోహిత్, విరాట్ అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉన్నా, త్వరలో మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు వీరిద్దరినీ ఎంపిక చేశారు. అయితే ఈ సిరీస్లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలను యువ ఆటగాడు శుభ్మన్ గిల్కు అప్పగించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: