బెట్టింగ్ యాప్ల వివాదం, సహారా గ్రూప్ అంబీ వ్యాలీ ప్రాజెక్ట్కు సంబంధించిన రూ.300 కోట్ల ఆస్తుల వ్యవహారంపై జరుగుతున్న మనీలాండరింగ్ కేసు (Money laundering case) దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో అనేక ప్రముఖులు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పలకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate) నుంచి నోటీసులు జారీ కావడం ప్రధానాంశంగా మారింది.
చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్ (Betting app) తో కేసు ముడిపడి ఉన్నందున మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ వారి స్టేట్మెంట్లను రికార్డు చేయనుంది. మనీలాండరింగ్ కేసులో ప్రముఖ నటుడు సోనూ సూద్ (Actor Sonu Sood) కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయనను సెప్టెంబర్ 24న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సూచించింది.
ఉతప్పకు ED నోటీసులు
ఇదిలా ఉండగా.. గతంలో శిఖర్ ధావన్, సురేష్ రైనా (Shikhar Dhawan, Suresh Raina) లకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినందుకు వారిద్దరిని ఈడీ విచారించింది. వీరు ఎందుకు ఈ యాప్ను ప్రచారం చేశారు, వారికి ఎంత డబ్బు లభించింది, యాప్తో వారికి ఉన్న సంబంధాలు ఏమిటి అనే విషయాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు ఇదే కేసులో యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప (Robin Uthappa) లను కూడా ఈడీ విచారించనుంది.
భారత క్రికెటర్లను ఈడీ ప్రశ్నించే ఈ మొత్తం విషయం బెట్టింగ్ యాప్ 1xBet కు సంబంధించినది కావడం గమనార్హం. ఈ కేసులో క్రికెటర్ల ప్రమేయంపై మరింత సమాచారం కోసం ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ విచారణల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రాబిన్ ఉతప్ప ప్రస్తుతం ఆసియా కప్ 2025లో వ్యాఖ్యాతగా ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: