RO-KO: భారత క్రికెట్ జట్టులో సీనియర్ ఆటగాళ్లకు మరియు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు మధ్య సఖ్యత లేదంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు. తానూ ఒక మనిషినేనని, నిర్ణయాల్లో తప్పులు జరగడం సహజమే కానీ, ఉద్దేశాలు మాత్రం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
Read Also: IPL 2026: క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన వైభవ్
“నేను కూడా మనిషినే.. తప్పులు చేసే హక్కు నాకు ఉంది”
‘రాయ్ స్పోర్ట్స్’ నిర్వహించిన ‘ట్రైల్బ్లేజర్స్’ కార్యక్రమంలో గంభీర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా “విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లకు మీరు వ్యతిరేకం అనే ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటారు?” అని ఒకరు ప్రశ్నించారు. దీనికి గంభీర్ బదులిస్తూ.. “నేను కూడా మనిషినే. తప్పులు చేసే అవకాశం నాకు కూడా ఇవ్వాలి. గత 18 నెలల్లో నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు. దాన్ని అంగీకరించడానికి నేను వెనుకాడను” అని అన్నాడు.

“కానీ నేను ఒక్కటే నమ్ముతాను. సరైన ఉద్దేశంతో తీసుకున్న తప్పుడు నిర్ణయం ఆమోదయోగ్యమే. కానీ, తప్పుడు ఉద్దేశంతో తీసుకున్న తప్పుడు నిర్ణయం మా డ్రెస్సింగ్ రూమ్లో కుదరదు” అని గంభీర్ పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్లోని ప్రతి ఒక్కరితో తాను నిజాయితీగా ఉన్నంతకాలం, వారి కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడగలిగినంత కాలం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లే భావిస్తానని తెలిపాడు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదానికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: