పాకిస్థాన్ క్రికెట్లో మళ్లీ అంతర్గత కలహాలు రేగాయి. స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, (Mohammad Rizwan) పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) (PCB) కొత్తగా అందించిన సెంట్రల్ కాంట్రాక్ట్పై సంతకం చేసేందుకు నిరాకరించడం దేశ క్రికెట్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. పీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 30 మంది ఆటగాళ్లు ఈ కొత్త ఒప్పందాలపై సంతకం చేసినప్పటికీ, రిజ్వాన్ మాత్రం ఇప్పటి వరకు సంతకం చేయలేదు. ఈ నిర్ణయంతో పీసీబీలో ఆందోళన నెలకొంది.
Read Also: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
తనను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం, టీ20 జట్టులో చోటు కల్పించకపోవడం, అలాగే కాంట్రాక్ట్ కేటగిరీలో మార్పులు చేయడం వంటి కారణాలతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల పీసీబీ సెంట్రల్ కాంట్రాక్టుల వ్యవస్థలో కీలక మార్పులు చేసింది.
గతంలో బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, రిజ్వాన్ వంటి స్టార్ ఆటగాళ్ల కోసం ప్రత్యేకించిన ‘కేటగిరీ A’ను పూర్తిగా రద్దు చేసింది. సీనియర్ త్రయం సహా మొత్తం పది మంది ఆటగాళ్లను ‘కేటగిరీ B’లో చేర్చింది.
కేటగిరీలో తనను తగ్గించడంతో పాటు
గత ఏడాది కాలంగా జట్టు ప్రదర్శన పట్ల బోర్డు తీవ్ర అసంతృప్తితో ఉందని చెప్పడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే, ఈ మార్పు తన గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని రిజ్వాన్ (Mohammad Rizwan) భావిస్తున్నాడు. కేటగిరీలో తనను తగ్గించడంతో పాటు, వన్డే కెప్టెన్గా ఉన్నపళంగా తొలగించడం ఆయనను తీవ్రంగా బాధించింది.

ఈ నేపథ్యంలోనే ఆయన కాంట్రాక్ట్పై సంతకం చేయడానికి రెండు కఠినమైన షరతులు విధించినట్లు సమాచారం. మొదటిది, సీనియర్, అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్ల కోసం ‘కేటగిరీ A’ను తక్షణమే పునరుద్ధరించాలి.
క్రీడా నిపుణుల మధ్య తీవ్ర చర్చ
రెండోది, కొత్తగా నియమించే కెప్టెన్కు బోర్డు జోక్యం లేకుండా పూర్తి స్వేచ్ఛ, నిర్దిష్ట పదవీకాలంపై హామీ ఇవ్వాలి.గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ అనేక గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికి రిజ్వాన్-పీసీబీ మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన మరింత ఆజ్యం పోసినట్లయింది.
డిసెంబర్ 2024 నుంచి టీ20 జట్టుకు కూడా దూరమైన రిజ్వాన్, బోర్డుపై ఇలా తిరుగుబాటు చేయడం అభిమానులు, క్రీడా నిపుణుల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: