Rinku Singh Father Health: టీ20 ప్రపంచకప్లో అత్యంత కీలకమైన సూపర్-8 దశకు చేరుకున్న తరుణంలో టీమిండియాకు ఊహించని పరిణామం ఎదురైంది. జట్టు స్టార్ ఫినిషర్, నమ్మదగ్గ బ్యాటర్ రింకూ సింగ్ వ్యక్తిగత కారణాలతో హుటాహుటిన జట్టును వీడారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి తీవ్రమైన ఆరోగ్య సమస్య తలెత్తడంతో, మేనేజ్మెంట్ అనుమతితో ఆయన ఉత్తరప్రదేశ్లోని తన స్వస్థలానికి పయనమయ్యారు.
Read Also: ICC ticket sales T20 : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
లివర్ కేన్సర్తో రింకూ తండ్రి పోరాటం
రింకూ సింగ్ తండ్రి గత కొంతకాలంగా లివర్ కేన్సర్తో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. కేన్సర్ నాలుగో దశకు చేరుకోవడంతో ఆయనను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించి వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం చెన్నైలో జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్కు రింకూ హాజరుకాలేదు. జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్లో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్లేనని తెలుస్తోంది.

సూపర్ 8 తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో ఉంది. ఇలాంటి కీలక సమయంలో డెత్ ఓవర్లలో బ్యాటింగ్కు దిగి జట్టుకు అండగా నిలిచే ఫినిషర్ రింకూ దూరం కావడం జట్టు సమతుల్యతపై ప్రభావం చూపనుంది. రింకూ మంచి ఫీల్డర్ కూడా కావడంతో జట్టుకు ఇది పెద్ద లోటుగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: