T20 World Cup Final Performance: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్,న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ పోరుకు ముందు, అంతర్జాతీయ పాప్ సింగర్ రికీ మార్టిన్ (Ricky Martin) తన అద్భుతమైన ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించనున్నారు. గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్ వస్తుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
Read Also: IND Vs ENG: ఇంగ్లాండ్ ఆటతీరు చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్
ముగింపు వేడుకల షెడ్యూల్.. ఎప్పటి నుంచి అంటే?
ఈ మెగా ఫైనల్ ముగింపు వేడుకలకు సంబంధించి ఐసీసీ కీలక అప్డేట్ ఇచ్చింది. సాయంత్రం 5:30 గంటలకు వినోద కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రికీ మార్టిన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపింది. “టీ20 వరల్డ్ కప్ వేడుక మరింత ఘనంగా మారింది. గ్లోబల్ ఐకాన్ రికీ మార్టిన్ ప్రదర్శనను ఎవరూ మిస్ కావద్దు” అంటూ ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
స్టేడియం గేట్లు ఓపెన్.. భారీ ఏర్పాట్లు!
ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చే లక్షలాది మంది అభిమానుల కోసం మధ్యాహ్నం 3:30 గంటలకే స్టేడియం గేట్లు తెరుచుకుంటాయని నిర్వాహకులు వెల్లడించారు. భద్రతా పరమైన కారణాలు, ముగింపు వేడుకలను దృష్టిలో ఉంచుకుని అభిమానులు ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.
వినోద కార్యక్రమాల అనంతరం రాత్రి 7:00 గంటలకు అసలు సిసలైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా గురువారం వాంఖడేలో జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి ఫైనల్ చేరింది. టీ20 చరిత్రలో భారత్ ఫైనల్కు చేరడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: