వెస్టిండీస్కు కీలకంగా నిలిచిన ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఇక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు (Farewell to international cricket) చెబుతున్నాడు. 37 ఏళ్ల రస్సెల్ తన స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ చివరి రెండు మ్యాచ్లు ఆడి రిటైర్మెంట్ ప్రకటించాడు. జమైకాలోని సబీనా పార్క్లో ఇవే అతని చివరి మ్యాచ్లు కావడం విశేషం.”విండీస్ తరపున ఆడటం నా గర్వకారణం. చిన్నప్పటి నుంచి ఇది నా కల. మైదానంలో నన్ను చూసిన ప్రతి యువ ఆటగాడికి నేను ప్రేరణగా ఉండాలనుకుంటాను” అని రస్సెల్ భావోద్వేగంగా తెలిపాడు. కుటుంబం ముందు, స్వస్థలంలో ఆడే అవకాశం అందుకే ప్రత్యేకమని ఆయన అభిప్రాయపడ్డాడు.

రికార్డులతో నిండిన కెరీర్
రస్సెల్ 2019 నుంచి విండీస్ తరపున ప్రధానంగా టీ20ల్లో ఆడాడు. మొత్తం 84 టీ20ల్లో పాల్గొని 1,078 పరుగులు చేశాడు. వాటిలో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్లో 61 వికెట్లు తీసి మెరుగు ప్రదర్శన ఇచ్చాడు.వన్డేల్లోనూ రస్సెల్ తనదైన ముద్ర వేశాడు. 56 మ్యాచ్ల్లో 1,034 పరుగులు చేసి, 70 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ మాత్రం కేవలం ఒక్కదాంట్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు.
లీగ్లలో రసరసలేని రస్సెల్
అంతర్జాతీయ క్రికెట్తో పాటు వివిధ టీ20 లీగ్లలో రస్సెల్ జోరుగా ఆడాడు. మొత్తం 561 టీ20 మ్యాచ్లలో 9,316 పరుగులు, 485 వికెట్లు తీసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్లో అతని స్ట్రైక్ రేట్ 168గా ఉండడం విశేషం. అలాగే 2 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
క్రికెట్కు కృతజ్ఞతతో వీడ్కోలు
ఆండ్రీ రస్సెల్ ఆటతోపాటు అభిమాన హృదయాల్లో కూడా చెరగని ముద్ర వేసాడు. తన ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి గుడ్బై చెప్పినా, లీగ్ల్లో మాత్రం ఇంకా చెలరేగే అవకాశం ఉంది.
Read Also : Alaska Earthquake : అమెరికాలోని అలాస్కాలో భూకంపం