రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers) బెంగళూరు (RCB) తరఫున బౌలింగ్ చేస్తున్న యువ పేసర్ యశ్ దయాళ్ (Yash Dayal) ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్కి చెందిన ఓ యువతి, ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. “పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లుగా మోసం చేశాడు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.ఘజియాబాద్కి చెందిన ఈ యువతి, తన ఫిర్యాదును సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసింది. ప్రేమ పేరుతో మానసిక, శారీరక, ఆర్థికంగా మోసపోయానని పేర్కొంది. చరణ్ను కుటుంబ సభ్యులకు కోడలిగా కూడా పరిచయం చేశాడని, తన నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించింది.
బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం
తన వద్ద స్క్రీన్షాట్లు, ఫొటోలు, వీడియో కాల్స్, చాట్ రికార్డుల్లా పక్కా ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపింది. ప్రేమలో ఉన్న సమయంలో డబ్బులు తీసుకున్నట్టు కూడా పేర్కొంది. ఇదే విధంగా యశ్ దయాళ్ గతంలో ఇతర యువతులను కూడా మోసం చేశాడన్న సమాచారం తనకు తెలిసిందని చెప్పింది.
పోలీసుల స్పందన లేదని బాధితురాలి వేదన
ఈ నెల 14న మహిళా హెల్ప్లైన్కి కాల్ చేసినప్పటికీ, స్థానిక పోలీస్ స్టేషన్ స్పందించలేదని బాధితురాలు వాపోయింది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, చివరకు నేరుగా సీఎంఓని ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించింది.
సీఎంఓ పక్కా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం
ఈ ఫిర్యాదుపై సీఎం కార్యాలయం తక్షణం స్పందించింది. ఇందిరాపురం సర్కిల్ ఆఫీసర్ను విచారణకు నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూలై 21లోగా నివేదికను సమర్పించాలంటూ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించింది. దీంతో యశ్ దయాళ్పై విచారణ మొదలయ్యే అవకాశం ఉంది.
ఇంకా ఎదురయ్యే దఫాలపై ఉత్కంఠ
ఈ ఆరోపణలు యశ్ దయాళ్ కెరీర్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. బాధితురాలి ఆధారాలు బలంగా ఉంటే, కేసు ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
Read Also : Telangana Government : స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రమోషన్లు