భారత క్రికెటర్ చేతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara), భార్య పూజా పుజారా ఇటీవల రాసిన పుస్తకంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 2009 ఐపీఎల్ సీజన్ సందర్భంగా, యువ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) కు మోకాలికి గాయమైంది.
Read Also: IND vs AUS: ఐదవ T20లో.. టాస్ ఓడిన టీమిండియా
దీనికి తక్షణ శస్త్రచికిత్స అవసరమైంది. గాయం కారణంగా పుజారా మానసికంగా కుంగిపోయాడు. అయితే, పుజారా కుటుంబం అతనికి సొంత ఊరు రాజ్కోట్లో చికిత్స చేయించాలని భావించింది. అప్పుడు దక్షిణాఫ్రికా (South Africa) లో చికిత్స చేయించేందుకు,షారూఖ్ ఖాన్ జోక్యం చేసుకున్నారు. పుజారాకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని గట్టిగా నమ్మిన SRK, అతనికి ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యం అందాలని పట్టుబట్టారు.
పుజారాకు చికిత్స చేయించడానికి, అతని కుటుంబ వైద్యుడు డా. షా, ఎంత మంది కుటుంబ సభ్యులనైనా సౌత్ ఆఫ్రికాకు విమానంలో తీసుకెళ్లడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు.పుజారా తండ్రి అరవింద్ పుజారాకు పాస్పోర్ట్ లేకపోవడంతో, (Shah Rukh Khan) తరపున కోల్కతా నైట్ రైడర్స్ మేనేజ్మెంట్ అతి తక్కువ సమయంలో అన్ని పత్రాలను సిద్ధం చేయించింది,
అతని ముఖంలో చిన్న పిల్లాడి చిరునవ్వు
అరవింద్ పుజారా (Arvind Pujara) త్వరగా దక్షిణాఫ్రికాకు చేరుకోవడానికి వీలు కలిగింది.తన తండ్రిని, కుటుంబ వైద్యుడిని సౌత్ ఆఫ్రికాలో చూసిన పుజారా కళ్ళలో ఆనందాన్ని అరవింద్ పుజారా గుర్తు చేసుకున్నారు. “అతను ఒంటరిగా విదేశీ గడ్డపై, గదికి పరిమితమై, చాలా నిరాశగా ఉన్నాడు.
నన్ను చూసినప్పుడు అతని ముఖంలో చిన్న పిల్లాడి చిరునవ్వు కనిపించింది,” అని ఆయన తెలిపారు. సౌత్ ఆఫ్రికాలో శస్త్రచికిత్స విజయవంతమైంది, ఆ తర్వాత పుజారా పూర్తిగా కోలుకుని భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకోగలిగాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: