ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12(Pro Kabaddi) ఫైనల్ పోరులో ఇవాళ దబాంగ్ ఢిల్లీ K.C.(Dabang Delhi K.C) జట్టు, పుణేరి పల్టాన్ జట్టుతో తలపడనుంది. ఢిల్లీలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో రెండు జట్లు అద్భుత ఫారంలో కొనసాగుతూ లీగ్ దశలోనే అగ్రస్థానాల్లో నిలిచాయి.
Read Also: Jemimah Rodrigues: జెమీమా ను గంభీర్తో పోలుస్తున్న నెటిజన్లు

రెండో టైటిల్ కోసం ఢిల్లీ–పుణేరి తలపడి పోరు
2021-22 సీజన్లో దబాంగ్ ఢిల్లీ చాంపియన్గా నిలిచింది. ఇక 2023-24 సీజన్లో(Pro Kabaddi) పుణేరి పల్టాన్ టైటిల్ దక్కించుకుంది. ఈసారి ఎవరు గెలిచినా రెండోసారి ఛాంపియన్గా అవతరించనున్నారు. ఈ నేపధ్యంలో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది.
స్టార్ రైడర్స్పై దృష్టి – అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయిలో
రెండు జట్లూ తమ స్టార్ రైడర్స్పై ఆధారపడి వ్యూహాలు రూపొందించాయి. ఢిల్లీ జట్టు తరఫున నవీన్ కుమార్, పుణేరి తరఫున అస్లామ్ ఇన్అమ్దార్ ఫామ్లో ఉండటంతో పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. దేశవ్యాప్తంగా అభిమానులు ఈ పోరును ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫైనల్తో ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12 ముగియనుంది. విజేత జట్టు రెండోసారి టైటిల్ను సొంతం చేసుకుంటూ కొత్త చరిత్ర సృష్టించబోతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: