త్వరలో జరగనున్న మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్ (Women’s World Cup semi-final 2025) మ్యాచ్కి ముందు టీమ్ ఇండియా (Team India) కు షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మొత్తం టోర్నమెంట్లో అద్భుత ఫామ్లో ఉన్న ఓపెనర్ ప్రతికా రావల్ (Pratika Rawal) గాయంతో సెమీస్ నుంచి వైదొలిగినట్లు సమాచారం.
ఈ విషయం బయటకు రావడంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో స్థిరతని అందిస్తున్న ప్రతికా స్థానంలో ఎవరు ఆడతారనే ప్రశ్న పెద్ద చర్చగా మారింది.
Read Also: Shreyas Iyer: శ్రేయస్కు గాయం.. అసలు ఏమైందంటే?

ఆమె జట్టులో రెండవ అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి
నిన్న బంగ్లాతో మ్యాచ్లో క్యాచ్ కోసం ప్రయత్నిస్తుండగా ఆమె కాలి మడమకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 30న AUSతో జరగనున్న సెమీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. సెకండ్ టాప్ స్కోరర్ (308R) అయిన రావల్ (Pratika Rawal) దూరమైతే జట్టుకు నష్టమే.
2025 మహిళల ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ, ప్రతికా రావల్ ఆరు ఇన్నింగ్స్లలో 51.33 సగటుతో 308 పరుగులు చేసింది. స్మృతి మంధాన (Smriti Mandhana) తర్వాత ఆమె జట్టులో రెండవ అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి. ప్రతికా, మంధానతో కలిసి అనేక మ్యాచ్లలో టీమ్ ఇండియాకు బలమైన ఆరంభాలను అందించి, జట్టు సెమీ-ఫైనల్కు చేరుకోవడానికి సహాయపడింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: