మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన భారత్–ఇంగ్లండ్ (India–England) టెస్టులో పంత్ గాయం భారత్కు ఊహించని దెబ్బైంది. చివరి సెషన్లో క్రిస్ వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేయబోయిన సమయంలో ఆయన పాదానికి బలంగా తాకింది.బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని పంత్ (Rishabh Pant) కుడికాలికి తగలడంతో తీవ్ర నొప్పి వచ్చింది. వెంటనే షూ విప్పి చూసేసరికి పాదం నలిగిపోయినట్టు స్పష్టమైంది. అక్కడికక్కడే రక్తం కారడం మొదలైంది. ఫిజియో వచ్చి చికిత్స అందించగా, పంత్ నొప్పితో విలవిల్లాడిపోయాడు.నొప్పి భరించలేని స్థితిలో పంత్ ఆటను కొనసాగించలేక రిటైర్డ్ హార్ట్గా బయటకి వెళ్లాడు. కాలిని నేలపై పెట్టడానికే ఇబ్బంది పడిన పంత్ను మొబైల్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు స్కానింగ్ కూడా నిర్వహించినట్టు సాయి సుదర్శన్ తెలిపారు.
ఇన్నింగ్స్లో పంత్ ఆకట్టుకున్న బ్యాటింగ్
గాయపడే సమయానికి పంత్ 48 బంతుల్లో 37 పరుగులు చేశాడు. పిచ్పై సెట్ అయి ఆడుతున్న సమయంలోనే గాయమవ్వడంతో భారత జట్టు ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.లార్డ్స్ టెస్టులో కీపింగ్ చేస్తున్న సమయంలో పంత్ వేలికి గాయమైంది. ఆ సమయంలో కూడా అతను ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో కీపింగ్ చేయలేకపోయాడు. అతని స్థానంలో ధ్రువ్ జురేల్ బాధ్యతలు చేపట్టాడు.
ఈ సిరీస్లో పంత్ ప్రభావం గణనీయమే
ఇప్పటి వరకు పంత్ ఆరు ఇన్నింగ్స్ల్లో 425 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలు నమోదు చేశాడు. సగటు స్కోరు 70.83. ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి కీపర్-బ్యాటర్గా గుర్తింపు పొందాడు.పంత్ మిగతా మ్యాచ్లు ఆడగలడా అనే సందేహాలు వెల్లివిరుస్తున్నాయి. గాయం తీవ్రంగా ఉంటే అతను లేకపోవడం భారత బ్యాటింగ్ లైనప్కి పెద్ద నష్టం అవుతుంది. ఫిట్నెస్ పట్ల ఇప్పుడు అందరిలోనూ ఆందోళన మొదలైంది.
Read Also : YS Sunitha : చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ