ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ ప్రపంచకప్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాలు తమ జట్లను ప్రకటించాయి. తాజాగా పాకిస్థాన్ కూడా తమ తాత్కాలిక 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
Read also: AP Sports: క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం: ఛైర్మన్ అనిమిని రవినాయుడు
ఈ జట్టులో ఒక స్టార్ ఆటగాడికి అవకాశం దక్కగా, మరో కీలక ఆటగాడు మాత్రం జట్టుకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ అనంతరం (జనవరి 11 తర్వాత) తుది జట్టును ప్రకటించనున్నట్లు పీసీబీ తెలిపింది. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ గ్రూప్-ఏలో పోటీ పడనుంది. ఈ గ్రూప్లో భారత్తో పాటు యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. భారత్ – పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది.
పాకిస్థాన్ తుది జట్టు
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, హారిస్ రౌఫ్, ఫకర్ జమాన్, మొహమ్మద్ వసీం జూనియర్, నసీం షా, అబ్దుల్ సమద్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: