ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమిపాలైన తర్వాత పాకిస్థాన్ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద దుమారం రేపాయి. ప్రెస్ కాన్ఫరెన్స్లో (press conference)ఆయన క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా రాజకీయ అంశాన్ని ప్రస్తావించడాన్ని బీసీసీఐ (BCCI) తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది. ఆఘాపై అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Read Also: AP Government: చిన్న కాంట్రాక్టర్లకు శుభవార్త.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వివాదానికి దారితీసిన అంశం ఏమిటంటే?
ఆసియా కప్ ఫైనల్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. టోర్నీ ద్వారా తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (సుమారు రూ. 28 లక్షలు) పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు మరియు భారత సైన్యానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. సూర్యకుమార్ నిర్ణయాన్ని అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి.
అయితే, ఫైనల్లో ఓటమి తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, సూర్యకుమార్కు పోటీగా ఒక ప్రకటన చేశాడు. భారత సైన్యం పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ‘ఆపరేషన్ సిందూర్‘ దాడుల్లో నష్టపోయిన తమ పౌరులకు, పిల్లలకు తమ జట్టు మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. “భారత్ జరిపిన దాడిలో ప్రభావితమైన మా పౌరులకు మా జట్టు మొత్తం మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తున్నాం” అని ఆఘా పేర్కొన్నాడు.
బీసీసీఐ అభ్యంతరం & తదుపరి చర్యలు
రెండు దేశాల మధ్య అత్యంత సున్నితమైన సైనిక చర్య గురించి క్రికెట్ వేదికపై మాట్లాడటంపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆఘా వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని మరియు క్రీడా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించాయని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత్ నిరాకరించిన ఉదంతాన్ని కూడా ఆఘా సమర్థించడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ వ్యవహారం అంతర్జాతీయ క్రికెట్ వేదికలపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ఫీజును ఎవరికి విరాళంగా ప్రకటించారు?
పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు మరియు భారత సైన్యానికి తన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (సుమారు రూ. 28 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
సల్మాన్ అలీ ఆఘా చేసిన వివాదాస్పద ప్రకటన ఏమిటి?
భారత సైన్యం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడుల్లో నష్టపోయిన తమ పౌరులకు మరియు పిల్లలకు తమ జట్టు మొత్తం మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తున్నట్లు ఆఘా ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: