బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆనందంలో వేలాది మంది అభిమానులు ఓపెన్ బస్ ర్యాలీకి హాజరయ్యారు. అయితే ఈ వేడుక విషాదంగా మారింది.వేడుకల ఉత్సాహం కాస్తా విషాదంలోకి మారింది. జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 47 మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో అభిమానుల హర్షం కన్నీళ్లలోకి మారిపోయింది.ఓపెన్ బస్ పరేడ్కు ముందుగా ప్రణాళిక వేసారు. అయితే దాదాపు రెండు లక్షల మంది ఒక్కసారిగా తరలిరావడంతో పరిస్థితి. పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఆపలేని జనం పొడవునా దౌర్భాగ్యాన్ని తెచ్చింది.
చిన్నారితో పాటు పలువురు ఆసుపత్రిలో చికిత్స
ఈ ప్రమాదంలో ఓ చిన్న బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గాయపడినవారిని నగరంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్సలో ఉన్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
సచిన్, విరాట్ స్పందన: శోకసందేశాలు
ఈ విషాద ఘటనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) స్పందించారు. “ఈ ఘటన హృదయాన్ని కలచివేస్తోంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని తెలిపారు. విరాట్ కోహ్లీ కూడా తీవ్రంగా కుంగిపోయినట్టు పేర్కొన్నారు. “మాటలు రావడం లేదు… అంతగా బాధ కలిగింది” అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు.
ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్రకటన
ఈ ఘటనపై ఆర్సీబీ కూడా స్పందించింది. “ప్రతి ఒక్కరి భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం. ఈ విషాదకర సంఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నాం” అని పేర్కొంది.ఆర్సీబీ అభిమానులకు ఈ టైటిల్ చాలా ప్రత్యేకం. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన విజయానికి జరుపుకున్న వేడుక ఇలా విషాదంగా ముగియడం అందరినీ కలచివేసింది.
Read Also : Stampede : దేశ క్రీడా చరిత్రలో అతిపెద్ద విషాదం ఇదే