ODI World Cup 2027: టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: పాకిస్థాన్లో జరిగిన ఈ మెగా టోర్నీని భారత్కు అందించి కోచ్గా తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడారు.
టీ20 వరల్డ్ కప్ 2026: తాజాగా స్వదేశంలో (భారత్-శ్రీలంక ఆతిథ్యంలో) ముగిసిన టీ20 ప్రపంచకప్లోనూ భారత జట్టును విజేతగా నిలిపారు.దీనితో భారత జట్టు కోచ్గా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి వ్యక్తిగా గంభీర్ రికార్డు సృష్టించారు.
Read Also: Saina Nehwal: బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్పై సైనా నెహ్వాల్ అసహనం
దక్షిణాఫ్రికా గడ్డపై ‘నిజమైన పరీక్ష’
అయితే గంగూలీ అభిప్రాయం ప్రకారం గంభీర్కు నిజమైన పరీక్ష ఇంకా మిగిలే ఉంది. అది ఐసీసీ వన్డే వరల్డ్కప్ 2027 రూపంలో ఎదురుకానుంది. ఈ టోర్నీ దక్షిణాఫ్రికాలో జరగనుండటంతో అక్కడి పరిస్థితులు జట్టుకు సవాల్గా మారవచ్చని ఆయన తెలిపారు. మజూందార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ “వైట్ బాల్ క్రికెట్లో గంభీర్కు అసలు పరీక్ష 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వరల్డ్ కప్లోనే ఉంటుంది. అక్కడి పరిస్థితులు అతనిని పరీక్షిస్తాయి. అయితే అతని దగ్గర ఉన్న జట్టుతో అతను విజయం సాధిస్తాడని నాకు నమ్మకం ఉంది” అని అన్నాడు.

గంగూలీ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ప్రదర్శన ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. “రెడ్ బాల్ క్రికెట్లో గంభీర్ ఇంకా మెరుగుపడాలి. పిచ్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి పిచ్లు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇంగ్లాండ్ సిరీస్ను చూడండి, అక్కడ పిచ్పై అతనికి ఎలాంటి నియంత్రణ లేదు” అని గంగూలీ వ్యాఖ్యానించాడు.“గౌతమ్ గంభీర్ మంచి కోచ్. అతనికి కొంత సమయం ఇవ్వాలని నేను ముందే చెప్పాను. వైట్ బాల్ క్రికెట్లో అతను చాలా మంచి కోచ్. అతని వద్ద మంచి జట్టు ఉంది,” అని గంగూలీ అన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: