నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం

Read Time:  1 min
Nitish Kumar Reddy received
Nitish Kumar Reddy received
FONT SIZE
GET APP

టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వస్థలానికి చేరుకున్న ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడి ఘనంగా సన్మానించారు. పూలదండలు వేసి, పూలు చల్లుతూ నినాదాలు చేశారు. అభిమానులు ఎయిర్పోర్టులోనే ఆయనను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. నితీశ్ వారందరితో కరచాలనం చేసి, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగింపుగా తన ఇంటికి చేరుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ చెలరేగిన ఆటతీరుకు అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా కీలక మ్యాచుల్లో నితీశ్ ప్రదర్శన టీమ్ ఇండియాకు విజయాలను అందించింది.

ఈ నేపధ్యంలో ఆయన స్వదేశానికి చేరుకోవడం తో అభిమానుల హర్షం వ్యక్తం చేసారు. అభిమానుల అండతో మరింత ఆత్మవిశ్వాసం పొందిన నితీశ్, రాబోయే టోర్నమెంట్లలో కూడా తన ప్రతిభను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. “మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. నా పైన మీరు చూపిస్తున్న విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాను” అని ఆయన వ్యాఖ్యానించారు. వైజాగ్‌లో నితీశ్‌కు జరిగిన ఈ వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రీడా అభిమానులు మరియు నెటిజన్లు నితీశ్ భవిష్యత్తు విజయాలపై ఆశలు వ్యక్తం చేస్తున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.