ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ మరోసారి తమ పటిష్టతను చాటింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై బ్యాటర్లు చాలా సునాయాసంగా ఛేదించారు. రోహిత్ శర్మ (76), సూర్యకుమార్ యాదవ్ (68) అద్భుతమైన ప్రదర్శనలతో 16వ ఓవర్లోనే మ్యాచ్ను ముగించారు. చెన్నై బౌలింగ్ వైఫల్యంతో మ్యాచ్ చేతులు తప్పింది. జడేజా ఒక్కరే వికెట్ తీసినప్పటికీ మిగిలిన బౌలర్లు బాటు కాలేకపోయారు.
రోహిత్ హిట్మ్యాన్ స్ట్రోక్ ప్లే
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ను రుజువు చేస్తూ ఇన్నింగ్స్ను చక్కగా నడిపించాడు. ఎప్పటిలాగే హిట్మ్యాన్ తన స్ట్రోక్ ప్లే తో అభిమానులను అలరించాడు. సూర్యకుమార్ కూడా తనదైన శైలిలో అర్ధశతకంతో ముంబై విజయానికి తోడ్పడాడు. చెన్నై బౌలింగ్ దళం పూర్తిగా అసహాయంగా కనిపించింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి.

రోహిత్ ఫామ్ గురించి ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు
మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ, ‘‘రోహిత్ ఫామ్ గురించి ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అతను టచ్లోకి వస్తే ప్రత్యర్థి గేమ్ నుంచి ఔటవుతుంది,’’ అని వ్యాఖ్యానించారు. సూర్యతో కలిసి రోహిత్ చేసిన భాగస్వామ్యం విజయంలో కీలకమైందని ఆయన పేర్కొన్నారు. అలాగే తమ బౌలర్లు కూడా చెన్నై టాప్ ఆర్డర్ను కట్టడి చేశారని హార్దిక్ అభినందించారు. CSKపై ఈ విజయం ముంబైకి ఎంతో విశ్వాసాన్ని కలిగించిందని తెలిపారు.