టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో భారత్తో జరగాల్సిన మ్యాచ్కు దూరంగా ఉండాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకున్న విషయం ఇప్పటికే క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీసింది.పాకిస్థాన్ నిర్ణయంపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. “ప్రపంచ క్రీడల స్ఫూర్తికి ఇది విరుద్ధం” అని పేర్కొంటూనే, పాక్ క్రికెట్ భవిష్యత్తుపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.
Read Also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

ఇండియాలో పర్యటించిన ప్రతీ జట్టుకు సెఫ్టీ ఉంటుంది
దీనిపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా రియాక్ట్ అయ్యారు. తమ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ ప్రకారమే ముందుకు వెళతామన్నారు. ఇలాంటి నేపథ్యంలో నిన్నటి వరకు పాకిస్తాన్ లో పర్యటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఈ వివాదంపై స్పందించారు.ఇండియా, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ (Michelle Marsh) సంచలన ప్రకటన చేశారు. ఇండియాలో పర్యటించిన ప్రతీ జట్టుకు సెఫ్టీ ఉంటుందన్నారు.
ఇందులో ఎలాంటి డౌట్ లేదని వివరించారు. అయితే, ఇండియా, పాక్ మ్యాచ్ పై తాను స్పందించి, ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయడం ఇష్టం లేదన్నారు. మేం ప్రపంచ కప్ పై ఫోకస్ చేశాం, వాళ్ల గురించి మాకు అవసరమే లేదని వివరించారు ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్. (Michelle Marsh) ఇది ఇలా ఉండగా, ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన జరుగాల్సి ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: