ఐపీఎల్ సీజన్లో ఆరంభం నుంచి ఆందోళనలతో ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ క్రమంగా తన పుంజుకుంటున్న ఫామ్ను కొనసాగిస్తోంది. తాజాగా వాంఖడే స్టేడియంలో సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మొదట బౌలర్లు అద్భుత ప్రదర్శనతో హైదరాబాద్ను 162 పరుగులకే కట్టడి చేయగా, ఆ తర్వాత బ్యాటర్లు దూకుడుగా ఆడి మ్యాచ్ను సునాయాసంగా ముగించారు. జాక్స్ 2 వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్లోనూ 36 పరుగులతో జట్టుకు మద్దతుగా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
హైదరాబాద్ బ్యాటింగ్ విఫలం
హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. అభిషేక్ శర్మ (40), క్లాసెన్ (38) తప్ప మిగిలిన బ్యాటర్లు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. పవర్ప్లేలోనూ రన్స్ వేగంగా రాలేదు. త్రావిస్ హెడ్, అభిషేక్ ఇద్దరూ 8 ఓవర్ల దాకా క్రీజులో ఉన్నా స్కోరు వేగం తగ్గిపోయింది. మిడిల్ ఓవర్లలో ముంబై బౌలర్లు స్పిన్నర్-పేసర్ల కాంబినేషన్తో SRH రన్రేట్ను బాగా కంట్రోల్ చేశారు. చివర్లో క్లాసెన్ కొన్ని శాట్లు బాదినా, మొత్తం స్కోరు పెద్దగా పెరగలేదు. అనికేత్ మెరుపులు కొట్టినప్పటికీ, స్కోరు 162కే పరిమితమైంది.
సూర్య-జాక్స్ ఛేజింగ్ సూపర్
ముంబై ఛేజింగ్లో రోహిత్ శర్మ, రికెల్టన్, జాక్స్, సూర్యకుమార్ రాణించడంతో విజయం సులభమైంది. రోహిత్ trademark సిక్సర్లతో మంచి ఆరంభం ఇచ్చాడు. రికెల్టన్ బౌండరీలు బాదగా, సూర్య-జాక్స్ కలిసి ఛేజింగ్ను వేగవంతం చేశారు. కమిన్స్ మూడవ వికెట్లు తీసినా, ముంబై జట్టుపై ప్రభావం చూపలేకపోయాడు. చివర్లో తిలక్ వర్మ నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో SRH బ్యాటింగ్లో నెమ్మదితనం, కీలక సమయంలో బిగ్ హిట్స్ లేకపోవడమే ఓటమికి కారణమైంది. ఇది హైదరాబాద్ జట్టుకు సీజన్లో ఐదో ఓటమి కావడం గమనార్హం.