గోట్ ఇండియా టూర్లో భాగంగా అర్జెంటీనా ఫుడ్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Messi) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మెస్సీ (Messi) కి ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయన్ను ఫలక్నుమా ప్యాలెస్కు తీసుకెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ఫుట్బాల్ దిగ్గజాన్ని కలిసేందుకు క్యూఆర్ కోడ్ పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు.
Read Also: Virat Kohli: స్వదేశానికి కోహ్లీ.. మెస్సీని కలవడానికేనా?

ఫుట్బాల్ శిక్షణ
అనంతరం సాయంత్రం 6:30 గంటలకు మెస్సి బృందం 20 వాహనాల కాన్వాయ్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ చేరుకోనుంది. అక్కడ మైదానంలో 30 మంది పిల్లలకు ఫుట్బాల్ శిక్షణ ఇచ్చిన తర్వాత మెస్సి, రేవంత్ రెడ్డి జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతాడు. ఆ తర్వాత విన్నర్, రన్నరప్ జట్లకు బహుమతులు ప్రదానం చేస్తాడు ఫుట్బాల్ స్టార్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: