పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (Messi) కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. కోల్కతాలో మెస్సీ టూర్ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియం వద్ద ఆయన అభిమానులు అదుపు తప్పి భద్రతా వలయాలను ఛేదించుకుని వచ్చి స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. వేలకు వేలు పోసి టికెట్లు కొన్నా తమ అభిమాన ఆటగాడిని సరిగ్గా చూడలేకపోయామంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్తను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Messi: కోల్కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్
వాటర్ బాటిళ్లు విసరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది
వివరాల్లోకి వెళితే.. కోల్కతాలోని యువ భారతి క్రీడాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. రూ.5,000 నుంచి రూ.25,000 వరకు వెచ్చించి అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. అయితే, మెస్సీ (Messi) చుట్టూ భద్రతా సిబ్బంది, ఇతర అతిథులు ఉండటంతో స్టాండ్స్లో ఉన్న వారికి అతను స్పష్టంగా కనిపించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో నిర్వాహకులు మెస్సీని హుటాహుటిన అక్కడి నుంచి తీసుకెళ్లారు. వాస్తవానికి మెస్సీ స్టేడియంలో ఒక రౌండ్ వేయాల్సి ఉన్నా, గందరగోళం కారణంగా అది సాధ్యపడలేదు. అతను ఉదయం 11:15 గంటలకు వేదిక వద్దకు వచ్చి కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ప్రధాన నిర్వాహకుడైన శతద్రు దత్తను అరెస్ట్ చేశామని ఏడీజీ (శాంతిభద్రతలు) జావేద్ షమీమ్ ధృవీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: