हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Lionel Messi – భారత్‌కు రానున్న మెస్సీ.. స్వాగతానికి బారీ ఏర్పాట్లు

Anusha
Latest News: Lionel Messi – భారత్‌కు రానున్న మెస్సీ.. స్వాగతానికి బారీ ఏర్పాట్లు

ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్, ఆర్జెంటీనా జాతీయ జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటనకు సిద్ధమవుతున్నారు. 14 సంవత్సరాల తర్వాత మెస్సీ మరోసారి భారత్‌లో అడుగుపెడతారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో భారత ఫుట్‌బాల్ అభిమానులలో ఉత్కంఠకు మరింత జోష్ నింపబడింది.

లియోనెల్ మెస్సీ 2025 డిసెంబర్ 14న ముంబై (Mumbai) కి రాబోతున్నారు. ఆయన ఈ పర్యటనను “గోట్ టూర్”గా నిర్వహిస్తున్నారు. గతంలో 2011లో కోల్‌కతా నగరంలో ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం ఆయన భారత్‌కు వచ్చారు. ఆ సందర్భంగా, అభిమానులు వారి అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూడడానికి 14 సంవత్సరాలు వేచి ఉన్నారు. ఈసారి ఆయన ముంబైలో ప్రత్యేక కార్యక్రమాల కోసం పర్యటిస్తారని సమాచారం.

నా యువ మిత్రులతో ఫుట్‌బాల్ ఆడబోతున్నారు

మెస్సీ పర్యటన ఖరారైన సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు తను సంతకం చేసిన ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ స్వయంగా తన ఎక్స్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ‘‘లియోనెల్ మెస్సీ మహారాష్ట్రకు వస్తున్నారు, నా యువ మిత్రులతో ఫుట్‌బాల్ ఆడబోతున్నారు! నాకు తను సంతకం చేసిన ఫుట్‌బాల్‌ను బహుమతిగా ఇచ్చినందుకు మెస్సీకి ధన్యవాదాలు!

డిసెంబర్ 14న గోట్ టూర్‌లో భాగంగా ముంబైకి రాబోతున్న ఆయన పర్యటనకు స్వాగతం పలుకుతున్నాను” అని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.మెస్సీ పర్యటన మహారాష్ట్రలోని యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఒక గొప్ప అవకాశం. రాష్ట్ర క్రీడా విభాగం, మిత్ర (MITRA), వెస్టర్న్ ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (WIFA) కలిసి మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 ఏళ్ల లోపు యువ క్రీడాకారులను ఎంపిక చేస్తాయి.

కేరళ లో కూడా పర్యటించనున్నారు

డిసెంబర్ 14న ఈ యువ క్రీడాకారులకు మెస్సీతో కలిసి శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమం యువతలో ఫుట్‌బాల్ పట్ల మరింత ఆసక్తిని పెంచుతుందని ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయం చేయాలని ఆయన కార్పొరేట్ సంస్థలను కూడా కోరారు.మెస్సీ పర్యటన కేవలం ముంబైకే పరిమితం కాదు.

కేరళ (Kerala) క్రీడా మంత్రి వి అబ్దురహీమాన్ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. నవంబర్ 2025లో జరిగే ఫిఫా అంతర్జాతీయ విండో సందర్భంగా మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జాతీయ జట్టు కేరళలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని అధికారిక ఈమెయిల్ ద్వారా ధృవీకరించినట్లు అబ్దురహీమాన్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/abhishek-sharma-abhishek-sharma-created-history-in-the-ind-vs-pak-match/sports/551697/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870