టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రాబిన్ ఊతప్ప క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కూడా తరచూ తన అనుభవాలను, ఆవిష్కరణలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఇటీవల తన యూట్యూబ్ చానల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా 2019 వన్డే ప్రపంచకప్ (2019 ODI World Cup) సందర్భంగా చోటుచేసుకున్న ఒక అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఆ సంఘటన తన వ్యక్తిగత సంబంధాలపై చూపిన ప్రభావాన్ని బహిరంగంగా అంగీకరించాడు.2019లో ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచకప్లో అంబటి రాయుడు ఎంపిక కాని విషయం అప్పట్లో పెద్ద వివాదాన్నే సృష్టించింది. టాప్ ఆర్డర్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ వచ్చిన రాయుడి (Ambati Rayudu) ని ఒక్కసారిగా పక్కన పెట్టి, విజయ్ శంకర్కు ప్రాధాన్యత ఇవ్వడం అప్పటి జట్టు ఎంపికలో ప్రధాన చర్చాంశమైంది. ఈ నిర్ణయంపై అప్పట్లో ఊతప్ప బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు
ఆ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీని పరోక్షంగా విమర్శిస్తూ రాయుడు లాంటి ప్లేయర్ను వదిలేయడం సరికాదని వ్యాఖ్యానించాడు.2019లో తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూను గుర్తుచేసుకుంటూ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పిన విషయాలు నిజమని నమ్మినప్పటికీ, వాటిని బహిరంగంగా మాట్లాడే ముందు విరాట్తో వ్యక్తిగతంగా చర్చించి ఉండాల్సింది. ఆ వ్యాఖ్యల తర్వాత కోహ్లీ (Kohli) తో నా స్నేహంలో మార్పు వచ్చింది. ఈ విషయంపై తర్వాత అతనితో మాట్లాడినప్పుడు నా తప్పును అంగీకరించాను” అని ఊతప్ప వివరించాడు.అయితే, ఆ ఇంటర్వ్యూలో తాను విరాట్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోలేదని ఊతప్ప స్పష్టం చేశాడు. “నేను నా అనుభవం గురించి చెప్పలేదు.
ఒకరినొకరు గౌరవించుకోవాలనే సున్నితమైన విషయాన్ని
నా అత్యంత సన్నిహితుడైన స్నేహితుడికి (అంబటి రాయుడు) అతని నాయకత్వంలో ఎదురైన అనుభవం గురించే మాట్లాడాను. అది కూడా అతని నాయకత్వాన్ని కాదు, నాయకత్వ శైలిని మాత్రమే ఉద్దేశించి అన్నాను. ప్రతి ఒక్కరికీ వారి సొంత నాయకత్వ శైలి, అభిప్రాయాలు ఉంటాయి. ఒకే క్రీడా రంగంలో ఉన్నప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలనే సున్నితమైన విషయాన్ని నేను ఆ ఘటన ద్వారా నేర్చుకున్నాను” అని ఆయన చెప్పుకొచ్చాడు.కాగా, 2019 ప్రపంచకప్ టోర్నమెంట్లో టీమిండియాలో నాలుగో స్థానం కోసం అంబటి రాయుడు ప్రధాన రేసులో ఉన్నాడు. అయితే, చివరి నిమిషంలో సెలెక్టర్లు అతని స్థానంలో ఆల్రౌండర్ విజయ్ శంకర్ను ‘3డి ప్లేయర్’ (మూడు రకాలుగా ఉపయోగపడతాడని) అంటూ ఎంపిక చేయడం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
రాబిన్ ఊతప్ప ఏ ఫార్మాట్లలో భారత్ తరఫున ఆడాడు?
రాబిన్ ఊతప్ప వన్డేలు, టీ20 ఇంటర్నేషనల్స్లో భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు.
రాబిన్ ఊతప్ప ఐపీఎల్లో ఏ జట్లకు ఆడాడు?
ఊతప్ప ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పుణే వారియర్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: