ఆసియా కప్ 2025 టోర్నీ కోసం టీమిండియా జట్టు ఇప్పటికే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, మాజీ లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.
గవాస్కర్ అభిప్రాయం ప్రకారం, శాంసన్ను ఓపెనర్గా కాకుండా ఫస్ట్ డౌన్లో ఆడించటం జట్టుకు చాలా లాభదాయకమని భావిస్తున్నారు. ఎందుకంటే టీమిండియాకు ఇప్పటికే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వంటి శక్తివంతమైన ఓపెనర్లు ఉన్నారు. అటువంటి సందర్భంలో మరో ఓపెనర్ను ప్రయోగించడం కంటే, బ్యాటింగ్ లైనప్ను బలపరచే విధంగా శాంసన్ను మూడో స్థానంలో ఆడించడం సరైన వ్యూహమని ఆయన పేర్కొన్నారు.
జితేష్ శర్మకు బదులు సంజూ శాంసన్కే అవకాశం
టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత జట్టు యూఏఈలో అడుగుపెట్టింది. సన్నాహకాలు కూడా ప్రారంభించింది. శుభ్మన్ గిల్ (Shubman Gill) రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది. శుభ్మన్ గిల్ ఓపెనర్గా దిగితే.. సంజూ శాంసన్ను ఏ స్థానంలో ఆడిస్తారనేది కూడా చర్చనీయాంశమైంది. మూడో స్థానంలో తిలక్ వర్మ రాణిస్తుండగా.. లోయరార్డర్లో వికెట్ కీపర్గా జితేష్ శర్మకు మెరుగైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది.
కానీ సునీల్ గవాస్కర్ మాత్రం ఆరంభ మ్యాచ్ల్లో సంజూకు అవకాశం ఇస్తారని చెప్పాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘సంజూ శాంసన్ను మూడో స్థానంలో ఆడించాలి. నా అభిప్రాయం ప్రకారం జితేష్ శర్మకు బదులు సంజూ శాంసన్కే అవకాశం దక్కుతుంది. కనీసం ఆరంభ మ్యాచ్ల్లోనైనా అతన్ని ఆడిస్తారనుకుంటున్నా. అతను రాణిస్తే జట్టులో కొనసాగిస్తారు. లేదంటే తప్పించి జితేష్ శర్మ (Jitesh Sharma) కు అవకాశం కల్పిస్తారు. సంజూ శాంసన్ను మూడో స్థానంలో ఆడించి తిలక్ వర్మను ఫినిషర్గా ఉపయోగించుకోవచ్చు.
బ్యాటింగ్ ఆర్డర్ను మార్చే అవకాశం లేదు
ఎందుకంటే జట్టులో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. అతను ఐదు, ఆరో స్థానంలోనే ఆడుతాడు.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.అయితే తిలక్ వర్మ మూడో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతని బ్యాటింగ్ ఆర్డర్ను మార్చే అవకాశం లేదు. ఒకవేళ సంజూ శాంసన్ను ఆడించాలనుకుంటే ఫినిషర్గా బరిలోకి దించవచ్చు. సెప్టెంబర్ 10న యూఏఈతో భారత్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. 14న పాకిస్థాన్తో, 19న ఒమన్తో లీగ్ మ్యాచ్లు ఆడనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ 28న జరగనుంది.
Read hindi news : hindi.vaartha.com
Read also: