Cricket politics controversy : వచ్చే టీ20 వరల్డ్కప్లో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించాలనే నిర్ణయంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రీడల్లోకి రాజకీయాలు చొరబడటం వల్ల క్రికెట్ స్ఫూర్తి దెబ్బతింటోందని, చివరికి నష్టపోయేది ఆటేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 15న కొలంబో లో జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్ నుంచి పాకిస్థాన్ వైదొలగడం అంతర్జాతీయ క్రికెట్కు మంచిది కాదని అన్నారు. “క్రికెట్ మైదానంలో ఆడి గెలవాలి గానీ, రాజకీయ నిర్ణయాలతో కాదు. అభిమానులు పోటీని చూడాలనుకుంటారు, బహిష్కరణలను కాదు” అని వ్యాఖ్యానించారు.
Read also: Recruitment 2026: ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

ఈ బహిష్కరణ వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆదాయానికి, (Cricket politics controversy) బ్రాడ్కాస్టర్ల నమ్మకానికి భారీ దెబ్బ తగలొచ్చని హెచ్చరించారు. స్పాన్సర్లు వెనక్కి తగ్గే ప్రమాదం ఉందని, టోర్నీల విలువ పడిపోతుందని చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో లాభపడేది ఒక్కటే — ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని విశ్లేషించారు.
ఒకవేళ పాక్ మ్యాచ్ ఆడకపోతే భారత్కు నేరుగా పాయింట్లు లభిస్తాయని, పాక్ నెట్ రన్ రేట్ భారీగా పడిపోతుందని తెలిపారు. దీంతో వారి సెమీఫైనల్ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాజకీయాల వల్ల క్రికెట్ను దూరం పెట్టకూడదని మోదీ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: