లార్డ్స్ మైదానంలో భారత్ మంచి సమాధానమే ఇస్తోంది. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా (Team India in the third Test) ఆత్మవిశ్వాసంగా ఎదురుదాడి చేస్తోంది. తొలుత బుమ్రా ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ను 387 పరుగులకే కట్టడి చేశాడు. జో రూట్ సెంచరీ చేసినా, మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోయారు.బ్యాటింగ్కు దిగిన భారత్కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి 107 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి పెరిగింది. టాప్ ఆర్డర్ మరోసారి విఫలమవడంతో ఫ్యాన్స్ మళ్లీ నిరాశపడ్డారు.

KL రాహుల్ – పంత్ భాగస్వామ్యం గేమ్ మలుపు తిప్పింది
అయితే, నాలుగో వికెట్కు కేఎల్ రాహుల్ (KL Rahul), రిషభ్ పంత్ కలిసి మ్యాచ్కి ఊపొచ్చించారు. ఇద్దరూ కలిసి 141 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. రాహుల్ 98 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పంత్ 74 పరుగులు చేసి రెండో రన్ను కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. సెంచరీ మిస్సయినా, మ్యాచ్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.లంచ్ సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 139 పరుగులు వెనకబడి ఉంది. అయినా, రాహుల్ బ్యాటింగ్లో ఉన్న నేపథ్యంలో భారత ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు.
మిగిలిన బ్యాటర్లపై భారీ భారం
ఇంకా నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. వీళ్లలో ఒకరు లేదా ఇద్దరు నిలిచినా, భారత్కు లీడ్ తీసే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఎక్కువ స్కోర్ చేయడమే లక్ష్యంగా ఉంది.ఇప్పటి వరకు సిరీస్లో ఇంగ్లండ్, భారత్ ఒక్కో టెస్ట్ గెలుచుకున్నాయి. ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న సిరీస్లో ఈ టెస్ట్ విజయం చాలా కీలకం. ఎవరు ఈ మ్యాచ్ గెలుస్తారో చూడాలి, కానీ టీమిండియా ధీమాగా ముందుకు సాగుతోంది.
Read Also : KA Paul: నా కుమారుడు అమెరికా ప్రెసిడెంట్ కావాలనేది నా కోరిక: కేఏ పాల్