Latest News: Jemimah Rodrigues: WBBL నుంచి తప్పుకున్న జెమీమా

Read Time:  1 min
Latest News: Jemimah Rodrigues: WBBL నుంచి తప్పుకున్న జెమీమా
FONT SIZE
GET APP

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. తన సహచర క్రీడాకారిణి స్మృతి మంధాన (Smriti Mandhana) కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు ఆమె భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె విజ్ఞప్తిని గౌరవిస్తున్నట్లు బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన ఘనత

పది రోజుల క్రితం హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం జెమీమా.. స్మృతి మంధాన వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చింది. అయితే, స్మృతి తండ్రి అనారోగ్యానికి గురికావడంతో పెళ్లి వాయిదా పడింది. ఈ క్లిష్ట సమయంలో స్మృతి కుటుంబానికి అండగా ఉండేందుకు జెమీమా (Jemimah Rodrigues) భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంది.

Jemimah withdraws from WBBL
Jemimah withdraws from WBBL

జెమీమా కూడా నిరాశ వ్యక్తం చేసింది

ఆమె నిర్ణయాన్ని తాము పూర్తిగా గౌరవిస్తున్నామని బ్రిస్బేన్ హీట్ యాజమాన్యం తెలిపింది.ఈ విషయంపై బ్రిస్బేన్ హీట్ సీఈఓ టెర్రీ స్వెన్సన్ (CEO Terry Swenson) మాట్లాడుతూ.. “జెమీమా ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందుకే ఆమె డబ్ల్యూబీబీఎల్‌ (WBBL) కు తిరిగి రాకపోయినా, భారత్‌లో ఉండేందుకు మేం అంగీకరించాం. తిరిగి రాలేకపోతున్నందుకు జెమీమా కూడా నిరాశ వ్యక్తం చేసింది.

క్లబ్‌కు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ,మిగతా మ్యాచ్‌లకు జట్టుకు శుభాకాంక్షలు చెప్పింది” అని వివరించారు.ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని బ్రిస్బేన్ హీట్, శుక్రవారం అడిలైడ్ ఓవల్‌లో సిడ్నీ సిక్సర్స్‌తో తలపడనుంది. జెమీమా స్థానంలో ఆల్‌రౌండర్ గ్రేస్ హారిస్ తిరిగి జట్టులోకి రానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.