ఐపీఎల్ 2025 లో అభిమానులు ఎదురుచూస్తున్న బిగ్ మ్యాచ్ వచ్చింది! ఈరోజు ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నారు. వేదికగా ముంబయిలోని వాంఖెడే స్టేడియం మెరుస్తోంది. టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో ఛేజింగ్కు సిద్ధమైంది.
ఈ మ్యాచ్లో ముంబయికి ఊరట కలిగించిన విషయం – స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా తుది జట్టులో ఉన్నాడు. బూమ్రా ఉండటం జట్టుకు పెద్ద ప్లస్. ప్రత్యర్థి బెంగళూరును కట్టడి చేయడంలో అతడి పాత్ర కీలకం కానుంది. మరోవైపు, హిట్మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్లో ఉన్నాడు. అయితే, ఈసారి అతడు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. ఇది ముంబయి వ్యూహంలో ఒక కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు.
బెంగళూరు ఎటువంటి మార్పులు చేయలేదు
ఇక బెంగళూరు విషయానికి వస్తే, జట్టులో ఎటువంటి మార్పులు లేవని కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపారు. ఇప్పటివరకు ఆ జట్టు మూడు మ్యాచ్లు ఆడి రెండు గెలిచింది. స్థిరతతో ఆడుతోన్న బెంగళూరు, ఈ మ్యాచ్లోనూ అదే ఊపును కొనసాగించాలనుకుంటోంది.
ముంబయికి టైం వచ్చింది..!
ఇక ముంబయి ఇప్పటివ రకు నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం ఒక్క మ్యాచ్లోనే గెలిచింది. ఈ నేపథ్యంలో ముంబయికి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. గెలిస్తే పాయింట్ల పట్టికలో కొంత ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇక ఓడితే పైనున్న జట్లకు మరింత వెనుకపడిపోతుంది.బూమ్రా బౌలింగ్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. వాంఖెడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అర్థరాత్రి వరకు థ్రిల్లింగ్ మ్యాచ్కు సిద్ధం కావాల్సిందే.
Read Also : IPL 2025 : ఐపీఎల్ 2025లో సంచలనాలు సృష్టిస్తోన్న 3 జట్లు