JammuKashmir Cricket: బెంగాల్ను ఓడించి తొలిసారి ఫైనల్కు అర్హత సాధించింది. కల్యాణీలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ మైదానంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో నాలుగో రోజే 6 వికెట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇటీవలి సంవత్సరాల్లో రెడ్ బాల్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న కశ్మీర్ జట్టుకు ఇది అతిపెద్ద విజయంగా నిలిచింది.
Read Also: ICC T20 rankings: టీ 20 ర్యాంకింగ్స్.. టాప్-10లోకి ఇషాన్

బౌలర్ల ధాటికి బెంగాల్ కుప్పకూలింది
ఈ మ్యాచ్లో జమ్ము కశ్మీర్ విజయంలో ప్రధాన పాత్ర వారి బౌలర్లదే. మూడో రోజు ఆటలో బెంగాల్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 99 పరుగులకే ఆలౌట్ అయింది. సీమ్ ఆల్రౌండర్ ఆకిబ్ నబీ నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను కట్టడి చేయగా, సునీల్ కుమార్ కీలక సహకారం అందించాడు. దీంతో జమ్ము కశ్మీర్కు 126 పరుగుల లక్ష్యం మాత్రమే మిగిలింది.
అబ్దుల్ సమద్ ధాటికి మ్యాచ్ మలుపు
లక్ష్య ఛేదనలో జమ్ము కశ్మీర్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ పేసర్లు మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్ వేగంగా వికెట్లు తీసి శుభమ్ పుండిర్, కెప్టెన్ పరాస్ డోగ్రాను పెవిలియన్కు పంపారు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్ ధాటిగా ఆడి మ్యాచ్ దిశను మార్చాడు. షాబాజ్ అహ్మద్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాది జట్టుకు మోమెంటం ఇచ్చాడు. మరోవైపు వంశజ్ శర్మ నిలకడగా బ్యాటింగ్ చేసి చివరకు విజయం ఖాయం చేశాడు.
ఫైనల్లో కర్ణాటకతో తలపడనున్న జమ్ము కశ్మీర్
విజయం ఖరారైన వెంటనే జమ్ము కశ్మీర్ ఆటగాళ్లు మైదానంలో సంబరాలు జరుపుకున్నారు. కోచ్ను గాల్లోకి ఎగరేసి ఆనందం వ్యక్తం చేశారు. మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు తీసిన ఆకిబ్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగే ఫైనల్లో జమ్ము కశ్మీర్ జట్టు కర్ణాటకతో పోటీపడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: