జగ్గయ్యపేట Jaggaiahpet : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (chandrababu) క్రీడా రంగానికి, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తుందని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) (Rajgopal) అన్నారు. గుంటూరులో జరిగిన 8వ మాష్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ (ఇంటర్ డిస్ట్రిక్ట్ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్) 2025 పోటీల్లో ప్రతిభతో 64 పతకాలు సాధించిన జగ్గయ్యపేట Jaggaiahpet స్విమ్మర్లను ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్- శ్రీదేవి దంపతులు సన్మానించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈతల పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తూ ఈప్రాంత ఖ్యాతిని విస్తరింపజేస్తున్నారంటూ స్విమ్మర్లను వారు అభినందించారు. ప్రభుత్వం పక్షాన క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల సదుపాయల కల్పనకు తన వంతు కృషి ఉంటుందని హామీ ఇచ్చారు.
Onion Prices : పడిపోయిన ఉల్లి ధరలు.. కేజీ ఎంతో తెలుసా..?

జగ్గయ్యపేట (jaggayyapeta) లో నిర్మించిన స్విమ్మింగ్పూల్ను శాప్ అనుమతులతో ప్రజలకు అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. కాగా విజేతలను కెడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, మాజీవిష్ సామినేని ఉదయథాను, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మాజీ కెడిసిసి చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, కృష్ణా స్విమ్మర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, గౌరవాధ్యక్షులు సిఐ మోటపోతుల కిషోర్ బాబు, స్విమ్మర్స్ కో-కన్వీనర్, సీనియర్ పాత్రికేయులు యలదండి శ్రీనివాసరావు, డ్రీమర్స్ స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మందడపు శ్రీనివాసరావు, కలాలి నరేష్, కోశాధికారి పి. రమాదేవి, కుర్ర శ్రీనివాస్, గంధం రాంబాబు, తుమ్మడపు నారాయణ, కృష్ణాస్విమ్మర్స్ అధ్యక్షులు కె కరుణాకర్, పూర్వ అధ్యక్షులు రాటకొండ శ్రీనివాసరావు, చెరుకూరి రమేష్, గోగుశెట్టి వెంకటమహేష్, పిన్నెల్లి పాండురంగారావు, సీనియర్ స్విమ్మర్స్ ధూళిపాళ లక్ష్మయణరావు, కొల్లి మార్షల్ స్టాలిన్, ఎస్ కె బాజాని విజేతలను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: